NTV Telugu Site icon

Konda Surekha : కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఫైర్

Konda Suresha

Konda Suresha

కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని మాపై పిచ్చి రాతలు రాయిస్తున్నారని, పదవి కాంక్షతో కేసీఆర్ ని కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం జరుగుతుందని ఆమె ధ్వజమెత్తారు. కేటీఆర్ సీఎం అనుకుని పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నారని, బీఆర్‌ఎస్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గరపెట్టుకో అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ రోజు వచ్చి మళ్ళీ కేసీఆర్ కనపడకుండా పోయాడు అని, ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ కనపడటం లేదని పోలీస్ స్టేషన్2 లో ఫిర్యాదు చేస్తామని, ఎంపీ ఎన్నికల్లో సిద్దిపేట,గజ్వేల్ నియోజకవర్గాల్లో BJP, BRS మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు మంత్రి కొండా సురేఖ. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకుని BRS పార్టీ నుంచి BJPకి క్రాస్ ఓటింగ్ జరిగిందని, సిసోడియాకి ఇవ్వని బెయిలు ముందుగా కవిత బయటికీ వచ్చిందంటే అది చీకటి ఒప్పందమే అని ఆమె అన్నారు.

Beauty Tips: బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఇది ట్రై చేయండి