KL Rahul: ప్లేయింగ్-11 పై కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul: టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. ఇప్పుడు వన్డే సిరీస్ వంతు వచ్చింది. ఇదే టైంలో ఫార్మాట్ మారిపోయింది, మైదానంలో కొంతమంది ఆటగాళ్లు కూడా మారిపోతున్నారు. ఈ ఫార్మాట్లోకి ఇద్దరు కీలక ఆటగాళ్లు తిరిగి వచ్చారు. వాళ్లిద్దరూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అలాగే మరికొందరు ఆటగాళ్లు కూడా జట్టులో చేరారు. శుభ్మాన్ గిల్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన ప్లేయింగ్ ఎలెవన్ గురించి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశాడు.
READ ALSO: Nuzvid: ప్రేమ జంట కోసం స్టేషన్ తలుపులు మూసివేసిన పోలీసులు.. బయటేమో రచ్చ!
Also Read
- Alcohol Effects: మద్యం కాలేయానికే కాదు.. మెదడుకూ ముప్పే..! వైద్యుల హెచ్చరిక
- Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్కు నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- FIFA World Cup 2026లో అసలైన పోరు మొదలు.. చివరి ఎనిమిది జట్ల షెడ్యూల్ ఇదే.!
- YSR 77th Birth Anniversary: మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ వైరల్..
ఈ వన్డే సిరీస్ నవంబర్ 30 ఆదివారం రాంచీలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శనివారం కెప్టెన్ కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ సిరీస్ అంతటా తాను మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తానని రాహుల్ స్పష్టం చేశాడు. “నేను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాను” అని ఆయన వెల్లడించాడు. రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ల స్థానాలపై ఆయన మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పంత్ జట్టులోకి తిరిగి రాగా, గైక్వాడ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ ఫార్మాట్లోకి అడుగు పెడుతున్నాడు. కానీ వారిద్దరిలో తుది జట్టులోకి ఎవరు అడుగుపెడుతున్నారని అడిగితే.. పంత్ గురించి రాహుల్ మాట్లాడుతూ.. “పంత్ ప్రతిభ గురించి అందరికీ తెలుసు. అతను ప్లేయింగ్ ఎలెవన్లో చేరితే బ్యాట్స్మన్గా మాత్రమే కాకుండా, వికెట్ కీపింగ్ కూడా నిర్వహించేవాడు అవుతాడు” అని అన్నారు. రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం ఇవ్వడం గురించి అడిగినప్పుడు, రాంచీ వన్డేలో ఈ ప్లేయర్ ఆడతాడో లేదో చెప్పలేదు, కానీ ఈ సిరీస్ లో గైక్వాడ్కు కచ్చితంగా అవకాశం లభిస్తుందని అన్నారు. “రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. తనకు వచ్చిన కొన్ని అవకాశాలలో అతను అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ సిరీస్ లో అతనికి అవకాశం వస్తుంది” అని రాహుల్ వెల్లడించారు.
READ ALSO: Mana Shankar Varaprasad Garu OTT Rights: ఆ ఓటీటీలోనే మన శంకర్ వరప్రసాద్గారు స్ట్రీమింగ్..
తాజావార్తలు
-
Dada FirstLook : సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Alcohol Effects: మద్యం కాలేయానికే కాదు.. మెదడుకూ ముప్పే..! వైద్యుల హెచ్చరిక
-
Vastu Mistakes: ఎంత సంపాదించినా పైసా మిగలట్లేదా? మీ బాత్రూమ్లోని ఈ 3 తప్పులే దానికి కారణం! అవి ఏంటో తెలుసా
-
Pathani Haar: ఆమిర్ ఖాన్ భార్య మెడలో మెరిసిన హైదరాబాదీ పఠానీ హార్.. అందరి చూపు దానిపైనే!
-
Peddireddy Ramachandra Reddy: తిరుపతిలో వైఎస్సార్కు నివాళి.. మావిగన్పై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!