Kiara Advani : నటన పరంగా నాతో నేనే పోటీ పడుతూ వుంటాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కియారా అద్వానీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటన తో బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది..తన నాజూకు అందాలతో కియారా అద్వానీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకుంటుంది.బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది..కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో కూడా నటించింది.ఇక కియారా అద్వానీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయి లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కియారా అద్వానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో వీరిద్దరూ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.పెళ్లి తర్వాత కూడా ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొనసాగే ప్రతి ఒక్క నటికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. అందుకే కెరియర్ పరంగా ఇతరులతో తాను పోటీ గురించి అస్సలు పట్టించుకోనని ఆమె తెలియజేశారు. నటన విషయంలో నాకు నేనే పోటీగా ఉంటానని ఆమె తెలిపారు. నటన పరంగా నాలో గతంలో కంటే ఇప్పుడు ఎంతవరకు మార్పు వచ్చిందనేదే నాకు ముఖ్యమని ఆమె తెలియజేశారు. ఈ విధంగా నాతో నేనే పోటీ పడుతూ మంచి నటిగా పరివర్తన చెందుతున్నానని ఆమె తెలియజేశారు. ప్రస్తుతం కీయారా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
తాజావార్తలు
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
-
Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!