Kiara Advani : నటన పరంగా నాతో నేనే పోటీ పడుతూ వుంటాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కియారా అద్వానీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటన తో బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది..తన నాజూకు అందాలతో కియారా అద్వానీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకుంటుంది.బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది..కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో కూడా నటించింది.ఇక కియారా అద్వానీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయి లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కియారా అద్వానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో వీరిద్దరూ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.పెళ్లి తర్వాత కూడా ఈ భామ వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొనసాగే ప్రతి ఒక్క నటికి ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. అందుకే కెరియర్ పరంగా ఇతరులతో తాను పోటీ గురించి అస్సలు పట్టించుకోనని ఆమె తెలియజేశారు. నటన విషయంలో నాకు నేనే పోటీగా ఉంటానని ఆమె తెలిపారు. నటన పరంగా నాలో గతంలో కంటే ఇప్పుడు ఎంతవరకు మార్పు వచ్చిందనేదే నాకు ముఖ్యమని ఆమె తెలియజేశారు. ఈ విధంగా నాతో నేనే పోటీ పడుతూ మంచి నటిగా పరివర్తన చెందుతున్నానని ఆమె తెలియజేశారు. ప్రస్తుతం కీయారా చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!