First Kho Kho World Cup in India: మరో వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ‘ఖో ఖో వరల్డ్ కప్’ వచ్చే ఏడాది భారతదేశంలో జరుగనుంది. 2025లో ఖో ఖో ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ భారత్లో జరుగుతుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఖో ఖో ఫెడరేషన్ బుధవారం ప్రకటించాయి. 24 దేశాలు, ఆరు ఖండాల నుండి 16 పురుష, మహిళా జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొననున్నాయి. ఖో ఖో పుట్టినిల్లు భారత్ అన్న విషయం తెలిసిందే.