ఢిల్లీః జీఎస్టీ వసూళ్ల పై… కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. నవంబర్ మాసం- 2021 జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ఇవాళ వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. నవంబర్ నెలలో దేశ వ్యాప్తంగా ఏకంగా… రూ.1,31,526 కోట్లు జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు స్పష్టం చేసింది. సీజీఎస్టీ రూ. 23,978 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 31,127 కోట్లు, ఐజీఎస్టీ రూ. 66,815 కోట్లు, సెస్ రూపంలో మొత్తం రూ. 9,606 కోట్లు వసూలు అయినట్లు ప్రకటన చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
గతేడాది నవంబర్ నెలతో పోల్చితే ఈ ఏడాది 25 శాతం వృద్ధి నమోదు అయినట్లు పేర్కొంది ఆర్థిక శాఖ. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత రెండోసారి అత్యధిక వసూళ్లు నమోదయినట్లు తెలిపింది. ఈ నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రం నుంచి రూ. 3,931 కోట్లు జీఎస్టీ వసూలు అయినట్లు తెలిపింది. గతేడాది కంటే… ఈ సారి తెలంగాణ రాష్ట్రం నుంచి జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు స్పష్టం చేసింది కేంద్రం.
