Tirupati Laddu Case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం..
- టీటీడీ కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం..
- కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddu Case: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు పవిత్రంగా భావించే.. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించింది.. అయితే, ఈ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించింటి సిట్.. ఇక, కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్ బృందం.. అయితే, సిట్ నిర్ణయంతో టీటీడీ అధికారులో ఆందోళన మొదలైంది.. మార్కెటింగ్ విభాగంలో పనిచేసి ఆక్రమాలుకు పాల్పడిన అధికారులుపై చర్యలకు సిద్ధం అవుతోంది సిట్.. కల్తీ నెయ్యి కేసు విచారణను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ సిట్ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో పిటిషన్ వేశారు..
Read Also: Cyclone: కోల్కతాకు తుఫాన్ ముప్పు.. మరో 18 రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న ఏఆర్ డెయిరీ నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిందన్న ఆరోపణలపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రిమినల్ కేసులో స్థానిక 2వ ఏడీఎం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే కాగా.. మంగళవారం సిట్ అధికారులు ఈ కేసును నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ ఫైల్ చేశారు. అయితే, నెయ్యి వినియోగం, నాణ్యత పరీక్షల అంశంలో టీటీడీ పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారింది. ఇటీవల ల్యాబ్లో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటంతో, ప్రసాదాల తయారీకి సకాలంలో నెయ్యి అందించలేకపోతోంది. తిరుమల ల్యాబ్లోనే నెయ్యి నాణ్యతను వంద శాతం పరీక్షించే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ భావించింది. నూతన పరికరాలు కావడంతో సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు అధిక సమయం పడుతున్నట్టు తెలిసింది. అయితే, కల్తీ నెయ్యి కేసు ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!