Kerala : కేరళలో బర్డ్ ఫ్లూ.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో హెచ్చరిక జారీ
- కేరళలో బర్డ్ ఫ్లూ
- ప్రజల్లో అవగాహన కల్పించాలన ప్రభుత్వం
- వ్యాధి సోకిన పక్షులకు ప్రజలు దూరంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala : ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (H5N1) అంటే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య మంత్రి వీణా గెరోజ్ అధ్యక్షతన జరిగిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ సమావేశం తర్వాత సాంకేతిక అంశాల మార్గదర్శకాలు, ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) జారీ అయ్యాయి. చేర్యాలలో బాతులు, కాకులకు ఏవియన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దీని కింద పక్షుల రంగానికి సంబంధించిన వ్యక్తులను పర్యవేక్షిస్తామని జార్జ్ తెలిపారు. తీవ్రమైన శరీర నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడేవారిని నిశితంగా పరిశీలించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
పక్షుల అసహజ మరణం
రాష్ట్రంలోని అలప్పుజా, పతనంతిట్ట, కొట్టాయం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కాకులు సహా పక్షులు ఏవైనా అసహజంగా చనిపోతే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని మంత్రి ప్రజలను కోరారు.
Also Read
- UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
Read Also:Sunday Stotram: ఆదివారం ఈ స్తోత్రం వింటే.. ఇంటిల్లిపాదికి రక్షణగా ఉంటుంది..
సలహా జారీ
చనిపోయిన పక్షులు లేదా వ్యాధి సోకిన పక్షులకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. మాంసం, గుడ్లు సరిగ్గా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. ఇప్పటి వరకు కేరళలో మానవులకు ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ రాలేదని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిపార్ట్మెంట్ తెలిపింది.
ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్
ఏవియన్ ఫ్లూ (H5N1), పక్షులలో వ్యాధిని కలిగించే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ రకం. అయితే ఈ వైరస్ మనుషులకు వ్యాపించడం చాలా అరుదు. గత కొద్దిరోజులుగా అలప్పుజా జిల్లాలో కాకులు, కోళ్లు, పిట్టలు, కొంగలు సహా పక్షులు చనిపోతున్నాయి.
Read Also:Ram Charan – Upasana Wedding Anniversary :12 వసంతాలు పూర్తి చేసుకున్న రామ్ చరణ్ దంపతులు, ఫోటో వైరల్
కాకులకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ
కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోనే మొదటిసారిగా అలప్పుజాలోని ముహమ్మ గ్రామ పంచాయతీలో కాకులకు బర్డ్ ఫ్లూ ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ (ఏహెచ్డి) నిర్ధారించింది. ఇంతలో పశుసంవర్ధక శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఆ ప్రాంతానికి సమీపంలోని హాట్స్పాట్లలో పక్షులను చంపడానికి పని చేస్తున్నాయి.
తాజావార్తలు
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!