Kerala : కేరళలో బర్డ్ ఫ్లూ.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో హెచ్చరిక జారీ
- కేరళలో బర్డ్ ఫ్లూ
- ప్రజల్లో అవగాహన కల్పించాలన ప్రభుత్వం
- వ్యాధి సోకిన పక్షులకు ప్రజలు దూరంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala : ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (H5N1) అంటే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య మంత్రి వీణా గెరోజ్ అధ్యక్షతన జరిగిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ సమావేశం తర్వాత సాంకేతిక అంశాల మార్గదర్శకాలు, ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) జారీ అయ్యాయి. చేర్యాలలో బాతులు, కాకులకు ఏవియన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. దీని కింద పక్షుల రంగానికి సంబంధించిన వ్యక్తులను పర్యవేక్షిస్తామని జార్జ్ తెలిపారు. తీవ్రమైన శరీర నొప్పులు, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడేవారిని నిశితంగా పరిశీలించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
పక్షుల అసహజ మరణం
రాష్ట్రంలోని అలప్పుజా, పతనంతిట్ట, కొట్టాయం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కాకులు సహా పక్షులు ఏవైనా అసహజంగా చనిపోతే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని మంత్రి ప్రజలను కోరారు.
Also Read
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
Read Also:Sunday Stotram: ఆదివారం ఈ స్తోత్రం వింటే.. ఇంటిల్లిపాదికి రక్షణగా ఉంటుంది..
సలహా జారీ
చనిపోయిన పక్షులు లేదా వ్యాధి సోకిన పక్షులకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. మాంసం, గుడ్లు సరిగ్గా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. ఇప్పటి వరకు కేరళలో మానవులకు ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ రాలేదని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిపార్ట్మెంట్ తెలిపింది.
ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్
ఏవియన్ ఫ్లూ (H5N1), పక్షులలో వ్యాధిని కలిగించే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ రకం. అయితే ఈ వైరస్ మనుషులకు వ్యాపించడం చాలా అరుదు. గత కొద్దిరోజులుగా అలప్పుజా జిల్లాలో కాకులు, కోళ్లు, పిట్టలు, కొంగలు సహా పక్షులు చనిపోతున్నాయి.
Read Also:Ram Charan – Upasana Wedding Anniversary :12 వసంతాలు పూర్తి చేసుకున్న రామ్ చరణ్ దంపతులు, ఫోటో వైరల్
కాకులకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ
కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోనే మొదటిసారిగా అలప్పుజాలోని ముహమ్మ గ్రామ పంచాయతీలో కాకులకు బర్డ్ ఫ్లూ ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ (ఏహెచ్డి) నిర్ధారించింది. ఇంతలో పశుసంవర్ధక శాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఆ ప్రాంతానికి సమీపంలోని హాట్స్పాట్లలో పక్షులను చంపడానికి పని చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
-
Vivo Y6a: మార్కెట్ లోకి వివో Y6a.. 7200 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది”.. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!