Site icon NTV Telugu

Sukhbir Singh Badal: ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ ఎప్పుడైనా బీజేపీలో చేరొచ్చు.. సుఖ్ బీర్ సంచలన వ్యాఖ్యలు

Sukhbir Singh Badal

Sukhbir Singh Badal

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు దశల ఎన్నికలు ముగిశాయి. అదే సమయంలో అన్ని పార్టీలు రాబోయే 3 దశల ప్రచారంలో తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. అయితే పంజాబ్‌లో రెండు పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. దీంతో పాటు చాలా కాలం పాటు కలిసి ఉన్న భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలీదళ్ కూడా వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో పంజాబ్‌ రాజకీయ పార్టీ శిరోమణి అకాలీదళ్‌ అధినేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా బీజేపీలో చేరవచ్చని సుఖ్‌బీర్ బాదల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పంజాబ్ లో దుమారం రేపుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆప్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

READ MORE: Atrocious: ఆస్తికోసం తల్లి అంతక్రియలు ఆపేసిన కొడుకు.. మూడు రోజులుగా ఫ్రీజర్‌ లోనే డెడ్‌ బాడీ

మరోవైపు, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వాడింగ్ గురువారం మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్‌కు ఓటు వేస్తే.. బీజేపీకి పరోక్షంగా సహాయం చేస్తున్నట్లే అని పేర్కొన్నారు. రెండు పార్టీలు బీజేపీని ఓడించే స్థితిలో లేవని, రెండు పార్టీలు బీజేపీ వ్యతిరేక ఓట్లను మాత్రమే కోస్తాయన్నారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌కు ఓటేయడమే మీ ఆప్షన్ అని చెప్పారు. కాగా.. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఇక్కడ ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 1న 7వ దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనితో పాటు ఇక్కడ ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.

Exit mobile version