Virtual Hearing : ఆన్లైన్ విచారణ జరుగుతుండగా కోర్టులో ప్లే అయిన బ్లూ ఫిల్మ్.. జడ్జి ఏం చేశాడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virtual Hearing : ఆన్లైన్ కోర్టు విచారణల సమయంలో అశ్లీల వీడియోలు ప్లే అవుతున్న కేసులు చాలా ఉన్నాయి. వారం రోజుల క్రితమే కర్ణాటక హైకోర్టు విచారణలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అసభ్యకర వీడియోలను ప్రదర్శించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో మరోసారి అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. హైకోర్టు తర్వాత, మరో కోర్టు విచారణ సందర్భంగా అసభ్యకరమైన వీడియోను ప్రదర్శించారు. కర్ణాటక స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (KSAT) వీడియో కాన్ఫరెన్స్లో అసభ్యకరమైన వీడియో ప్రదర్శించబడింది. ఆన్లైన్ విచారణలో అశ్లీల వీడియోలు ప్లే కావడంతో న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. దీంతో కోర్టు ఆన్లైన్ కార్యకలాపాలను హడావుడిగా నిలిపివేయాల్సి వచ్చింది.
Read Also:Hyderabad : భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే వీడియో తీసిన భర్త..
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఈ విషయమై ఒక KSAT అధికారి బెంగళూరులోని సెంట్రల్ సేన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో లాగిన్ అయి అభ్యంతరకర వీడియో చూపించిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత అధికారులు ఆన్లైన్ విచారణను రద్దు చేశారు. దీనిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67ఏ కింద కేసు నమోదు చేశారు. అసభ్యకర వీడియోలు చూపుతున్న దుశ్చర్యలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also:TS Assembly Session: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 17 వరకు జరిగే అవకాశం
కేవలం వారం రోజుల క్రితం కర్ణాటక హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్లో అసభ్యకరమైన చిత్రం ప్రదర్శించబడింది. కంప్యూటర్ విభాగం రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఎన్. సురేష్ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు సెక్షన్ 67, 67(ఏ) కింద కేసు నమోదు చేశారు. కోర్టు విచారణ సందర్భంగా అసభ్యకర వీడియో ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కర్ణాటక హైకోర్టు బెంగళూరు, ధార్వాడ్, కలబురగి బెంచ్లలో వీడియో కాన్ఫరెన్స్ , కోర్టుల ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధించింది. డిసెంబరు 5న కోర్టులో ప్రధాన న్యాయమూర్తి పిబి వరాలే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?