NTV Telugu Site icon

దుర్గాదేవికి మంత్రి లేఖ… దేనికోసమంటే…

మాములుగా మనకు ప్రమోషన్స్ కావాలంటే బాస్ ను కాకాపడతారు.  రాజకీయంగా ఎదుగుదల కావాలంటే పైస్థాయిలో ఉండే నేతలను, మంత్రులను కాకాపడుతుంటాం.  మంత్రి పదవులు కావాలంటే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలి.  అయితే, ఓ మంత్రికి డెప్యూటీ సీఎం కావాలనే కోరిక బలంగా ఉన్నది.  ఆ విషయాన్ని అధిష్టానం ముందుకు తీసుకెళ్లకుండా డైరెక్ట్ గా భగవంతుడిని ముందుకు తీసుకెళ్లాడు.  దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.  

కర్ణాటక మంత్రి బి శ్రీరాములు నిన్నటి రోజున కలబుర్గి లోని దుర్గాదేవి దేవాలయాన్ని సందర్శించారు.  తన మనసులోని కోరికను కాగితంపై రాసి అమ్మవారి పాదాలచెంత ఉంచాడు. దీంతో మంత్రి శ్రీరాములు మనసులో ఏమున్నదో బహిర్గతం అయ్యింది.  అమ్మవారి ముందుంచిన ఆ కోరికను అధిష్ఠానం నెరవేరుస్తుందా…? చూడాలి.  గతంలో కలబుర్గి ప్రాంతం హైదరాబాద్ సంస్థానంలో ఉండేది.  తెలంగాణ విమోచనం తరువాత కలబుర్గి ప్రాంతం కర్ణాటకలో విలీనం అయ్యింది.  దీంతో ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 వ తేదీన విమోచన దినోత్సవాన్ని ఆ ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.  గతేడాది నుంచి కళ్యాణ్ కర్ణాటక ఉత్సవ్ వేడుకను నిర్వహిస్తున్నారు.  ఈ వేడుకలో మంత్రి పాల్గొన్నారు.