Karnataka : ప్రైవేట్ ఉద్యోగాల్లో 50-75శాతం రిజర్వేషన్లు.. కర్ణాటక కేబినెట్ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka : ప్రైవేట్ రంగంలో సి, డి కేటగిరీ పోస్టులకు 100శాతం కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ప్రకటించారు. ఈ బిల్లు ప్రకారం మేనేజ్మెంట్ పోస్టుల్లో 50శాతం, నాన్-మేనేజిరియల్ పోస్టుల్లో 75శాతం స్థానిక అభ్యర్థులను నియమించడం తప్పనిసరి. కన్నడిగులకు సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేలా చూడాలని, సొంత రాష్ట్రంలోనే మంచి జీవనం సాగించే అవకాశం రావాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి అన్నారు.
Read Also:Uttarpradesh : అంతా అబద్ధం.. ఆ యువకుడిని ఏడు సార్లు కాదు ఒక సారే పాము కరిచింది
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
‘కర్ణాటక రాష్ట్ర పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు ఉపాధి కల్పించే బిల్లు, 2024’ను గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్థానిక అభ్యర్థి అంటే కర్ణాటకలో పుట్టి 15 ఏళ్లుగా రాష్ట్రంలో నివాసం ఉంటూ, కన్నడ భాషను చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసిన వ్యక్తి ఇందుకు అర్హుడని బిల్లు నిర్వచించింది. అభ్యర్థులు తప్పనిసరిగా కన్నడ భాషతో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేని పక్షంలో ప్రభుత్వం నోటిఫై చేసిన నోడల్ ఏజెన్సీ ద్వారా నిర్దేశించిన కన్నడ ప్రావీణ్యం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వ సహకారంతో స్థానిక అభ్యర్థులకు మూడేళ్లలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాయి.
Read Also:Silver Rate Today: వెండి కూడా బంగారమైంది.. లక్ష రూపాయలు దాటేసింది!
తగినంత సంఖ్యలో స్థానిక అభ్యర్థులు ఇప్పటికీ అందుబాటులో లేకుంటే, కంపెనీలు మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఇచ్చిన సడలింపు మేనేజ్మెంట్ వర్గాలకు 25శాతం, నాన్-మేనేజ్మెంట్ వర్గాలకు 50శాతం కంటే తక్కువ ఉండకూడదు. ఎంప్లాయ్మెంట్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ను పాటించనందుకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు.
తాజావార్తలు
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
-
Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!