Karnataka : ప్రైవేట్ ఉద్యోగాల్లో 50-75శాతం రిజర్వేషన్లు.. కర్ణాటక కేబినెట్ ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka : ప్రైవేట్ రంగంలో సి, డి కేటగిరీ పోస్టులకు 100శాతం కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం ప్రకటించారు. ఈ బిల్లు ప్రకారం మేనేజ్మెంట్ పోస్టుల్లో 50శాతం, నాన్-మేనేజిరియల్ పోస్టుల్లో 75శాతం స్థానిక అభ్యర్థులను నియమించడం తప్పనిసరి. కన్నడిగులకు సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేలా చూడాలని, సొంత రాష్ట్రంలోనే మంచి జీవనం సాగించే అవకాశం రావాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి అన్నారు.
Read Also:Uttarpradesh : అంతా అబద్ధం.. ఆ యువకుడిని ఏడు సార్లు కాదు ఒక సారే పాము కరిచింది
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
‘కర్ణాటక రాష్ట్ర పరిశ్రమలు, కర్మాగారాలు, ఇతర సంస్థలలో స్థానిక అభ్యర్థులకు ఉపాధి కల్పించే బిల్లు, 2024’ను గురువారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. స్థానిక అభ్యర్థి అంటే కర్ణాటకలో పుట్టి 15 ఏళ్లుగా రాష్ట్రంలో నివాసం ఉంటూ, కన్నడ భాషను చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసిన వ్యక్తి ఇందుకు అర్హుడని బిల్లు నిర్వచించింది. అభ్యర్థులు తప్పనిసరిగా కన్నడ భాషతో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేని పక్షంలో ప్రభుత్వం నోటిఫై చేసిన నోడల్ ఏజెన్సీ ద్వారా నిర్దేశించిన కన్నడ ప్రావీణ్యం పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే, పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వ సహకారంతో స్థానిక అభ్యర్థులకు మూడేళ్లలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాయి.
Read Also:Silver Rate Today: వెండి కూడా బంగారమైంది.. లక్ష రూపాయలు దాటేసింది!
తగినంత సంఖ్యలో స్థానిక అభ్యర్థులు ఇప్పటికీ అందుబాటులో లేకుంటే, కంపెనీలు మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఇచ్చిన సడలింపు మేనేజ్మెంట్ వర్గాలకు 25శాతం, నాన్-మేనేజ్మెంట్ వర్గాలకు 50శాతం కంటే తక్కువ ఉండకూడదు. ఎంప్లాయ్మెంట్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ను పాటించనందుకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా విధించవచ్చు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!