Karnataka Elections 2023: ఓట్లకు ఇంకా వారం టైం ఉంది.. కానీ ముందే ఓటేసిన తాత
Karnataka Elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరుమీద ఉన్నాయి. ఎలగైనా అధికారం చేజిక్కించుకోవాలని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో కర్ణాటకలో అనేక వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా వారం రోజులు ఉండగానే ఓ శతాధిక వృద్ధుడు ఓటేశాడు. ఓవైపు ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగానే తాత ఓటెయ్యడం అక్కడ చర్చనీయాంశమైంది. అతడికి ఆ అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది.
Read Also: Nithish Kumar : సీఎం నితీష్కు షాక్.. బీహార్ కులగణనపై పాట్నా హైకోర్టు స్టే
Also Read
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
- Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
కరోనా మహమ్మారి దెబ్బతో ప్రపంచం మొత్తం తలకిందులైంది. అన్ని రంగాల్లోనూ మార్పులొచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ విధానాల్లోనూ మార్పులను తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం మాదిరిగా కరోనాతో బాధపడుతున్నవారితో పాటు వృద్దులకు ‘వోట్ ఫ్రం హోం’ సదుపాయం కల్పించింది. అంటే కురువృద్ధులై ఉండి వారి వయసు 80 ఏళ్లు పైబడి.. పోలింగ్ బూత్ వరకు నడిచే పరిస్థితి లేని వారు ఇంటివద్దే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది.
Read Also: DK Shiva kumar: శివ శివ.. నీకే ఎందుకిలా.. టైం బాగోలేనట్టుంది
కాకపోతే ఇంటినుండే ఓటు హక్కును వినియోగించుకుంటామని ముందుగానే ఈసీకి సమాచారం అందిచాలి. అప్పుడు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోలింగ్ రోజుకంటే ముందే ఓటేయవచ్చన్న మాట. ఈసీ కల్పించిన ఆ అద్భుత అవకాశాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ శతాధిక వృద్దుడు ఉపయోగించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలోని చిక్కోడికి చెందిన మహాదేవ మహాలింగమాలి 103 ఏళ్ల వయసులోనూ ఓటేయాలనుకున్నాడు. వయసు రీత్యా పోలింగ్ బూత్ వరకు వెళ్లేందుకు తనకు శరీరం సహకరించదు. కాబట్టి ఇంటి నుండే ఓటేస్తానని ఈసీకి విన్నవించుకున్నాడు. దీంతో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. రహస్యంగా తనకు ఇష్టమైనవారికి ఆయన ఓటేయగా ఆ బ్యాలెట్ పేపర్ ను అధికారులు తీసుకున్నారు. అనంతరం ఓటేసినట్లు అతడి వేలికి సిరా అంటించారు. ఈ క్రమంలో ఇన్నేళ్ల వయసులోనూ ఓటేసిన మహాదేవను కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఫోన్ చేసి అభినందించారు. ఇక తనకు ఇంటివద్దే ఓటేసే అవకాశం కల్పించిన ఈసికి మహాదేవ మహాలింగ కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!