Karnataka Elections 2023: ఓట్లకు ఇంకా వారం టైం ఉంది.. కానీ ముందే ఓటేసిన తాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరుమీద ఉన్నాయి. ఎలగైనా అధికారం చేజిక్కించుకోవాలని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఎన్నికల సందర్భంలో కర్ణాటకలో అనేక వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా వారం రోజులు ఉండగానే ఓ శతాధిక వృద్ధుడు ఓటేశాడు. ఓవైపు ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతుండగానే తాత ఓటెయ్యడం అక్కడ చర్చనీయాంశమైంది. అతడికి ఆ అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది.
Read Also: Nithish Kumar : సీఎం నితీష్కు షాక్.. బీహార్ కులగణనపై పాట్నా హైకోర్టు స్టే
Also Read
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
- Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
- FCRA Bill: 'మా చట్టాల గురించి మీకెందుకు?'.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
కరోనా మహమ్మారి దెబ్బతో ప్రపంచం మొత్తం తలకిందులైంది. అన్ని రంగాల్లోనూ మార్పులొచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ విధానాల్లోనూ మార్పులను తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం మాదిరిగా కరోనాతో బాధపడుతున్నవారితో పాటు వృద్దులకు ‘వోట్ ఫ్రం హోం’ సదుపాయం కల్పించింది. అంటే కురువృద్ధులై ఉండి వారి వయసు 80 ఏళ్లు పైబడి.. పోలింగ్ బూత్ వరకు నడిచే పరిస్థితి లేని వారు ఇంటివద్దే ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం కల్పించింది.
Read Also: DK Shiva kumar: శివ శివ.. నీకే ఎందుకిలా.. టైం బాగోలేనట్టుంది
కాకపోతే ఇంటినుండే ఓటు హక్కును వినియోగించుకుంటామని ముందుగానే ఈసీకి సమాచారం అందిచాలి. అప్పుడు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోలింగ్ రోజుకంటే ముందే ఓటేయవచ్చన్న మాట. ఈసీ కల్పించిన ఆ అద్భుత అవకాశాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓ శతాధిక వృద్దుడు ఉపయోగించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలోని చిక్కోడికి చెందిన మహాదేవ మహాలింగమాలి 103 ఏళ్ల వయసులోనూ ఓటేయాలనుకున్నాడు. వయసు రీత్యా పోలింగ్ బూత్ వరకు వెళ్లేందుకు తనకు శరీరం సహకరించదు. కాబట్టి ఇంటి నుండే ఓటేస్తానని ఈసీకి విన్నవించుకున్నాడు. దీంతో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. రహస్యంగా తనకు ఇష్టమైనవారికి ఆయన ఓటేయగా ఆ బ్యాలెట్ పేపర్ ను అధికారులు తీసుకున్నారు. అనంతరం ఓటేసినట్లు అతడి వేలికి సిరా అంటించారు. ఈ క్రమంలో ఇన్నేళ్ల వయసులోనూ ఓటేసిన మహాదేవను కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఫోన్ చేసి అభినందించారు. ఇక తనకు ఇంటివద్దే ఓటేసే అవకాశం కల్పించిన ఈసికి మహాదేవ మహాలింగ కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!