Site icon NTV Telugu

Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.ఆర్ గవాయి నియామకం

Gavay

Gavay

జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. “జస్టిస్ బిఆర్ గవాయ్ నియామకం భారత న్యాయవ్యవస్థకు కీలక అడుగు. న్యాయ రంగంలో ఆయన తన శ్రేష్ఠత, నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందారు” అని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.

Also Read:Kawasaki Versys 650: కొత్త లుక్, ప్రమాణాలతో అదరగొట్టిన అడ్వెంచర్ టూరర్.. కవాసకి వెర్సిస్ 650..!

జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టులో గౌరవనీయమైన న్యాయమూర్తి, తన కెరీర్‌లో అనేక ముఖ్యమైన కేసులను తీర్పు ఇచ్చారు. జస్టిస్ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. అయితే, జస్టిస్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా కేవలం ఆరు నెలలు మాత్రమే కొనసాగనున్నారు. ఈ సంవత్సరం నవంబర్‌లో పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ గవాయ్ మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Also Read:Gorantla Madhav: బెయిల్‌పై విడుదలైన గోరంట్ల మాధవ్.. సీఎంపై సంచలన వ్యాఖ్యలు!

జస్టిస్ గవాయ్ న్యాయవాద వృత్తి

మహారాష్ట్రలోని అమరావతిలో నవంబర్ 24, 1960న జన్మించిన జస్టిస్ గవాయ్, ప్రముఖ సామాజిక కార్యకర్త, బీహార్, కేరళ మాజీ గవర్నర్ దివంగత ఆర్ఎస్ గవాయ్ కుమారుడు. జస్టిస్ గవాయ్ నవంబర్ 14, 2003న బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. నవంబర్ 12, 2005న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ గవాయ్ ముంబై, నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీలలో బెంచ్‌లకు నాయకత్వం వహిస్తూ 15 సంవత్సరాలకు పైగా సేవలందించారు. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే మే 14న గవాయ్ CJIగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

Exit mobile version