John Abraham : మూగజీవాల కోసం పిలుపునిచ్చిన స్టార్ హీరో
- మూగ జీవాలని రక్షించాలని జాన్ అబ్రహాం పిలుపు
- ఏనుగులను రక్షించాలంటూ నేపాల్ ప్రభుత్వానికి లేఖ
- చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్ నిర్వహించొద్దంటూ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
John Abraham : ఇటీవల కాలంలో మెగా కోడలు ఉపాసన తన ఐస్ ల్యాండ్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. వరుసగా దేశవిదేశాల్లో పర్యటిస్తున్న ఉపాసన ఐస్ ల్యాండ్ లో విహారయాత్రకు వెళ్లాల్సి ఉండగా.. తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడానికి కారణం.. అక్కడి ప్రభుత్వం 2000 తిమింగళాల్ని నిర్ధయగా చంపడానికి ఆదేశించడమేనని తెలిపారు. వేటగాళ్లకు లైసెన్సులు మంజూరు చేయాలని అధికారికంగా ఐస్ ల్యాండ్ ప్రభుత్వం ప్రకటించిన కారణంగా తన పర్యటనను రద్దు చేసుకున్నానని అన్నారు. ఉపాసన నిర్ణయాన్ని అభిమానులు మెచ్చకున్నారు. తనపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఒక గొప్ప కాజ్(సామాజిక కారణం) కోసం తన టూర్ రద్దు చేసుకోవడాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు అలాంటి ఒక కాజ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం కూడా ముందుకు వచ్చారు. అడవుల్లో జీవించే తెలివైన, సున్నితమైన జంతువుల్లో ఏనుగులు ఉన్నాయి. వాటిని హింసించడం ఆపాలని ఆయన పిలుపు నిచ్చారు. జంతువులను మానసికంగా హింసిస్తూ శారీరక ఒత్తిడికి గురి చేయడం సరికాదన్నాడు. ఈ కారణంగా ‘చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్’ను రద్దు చేయాలని జాన్ అబ్రహం నేపాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు నేపాల్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖను పంపారు.
Read Also:YCP vs TDP: కుర్చీ కోసం వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నేటి సర్వసభ్య సమావేశంకు భారీ బందోబస్తు!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్లో ఏనుగులను ఆటల పేరుతో ఒత్తిడికి గురి చేస్తున్నారని జాన్ అబ్రహాం అన్నారు. ఈ ఫెస్టివల్ కొందరికి ఆనందం కలిగించవచ్చు కానీ, ఏనుగులపై ఒత్తిడి ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నానని అన్నారు. ఏనుగులు తెలివైనవి.. ఇలాంటి సున్నితమైన జంతువులతో ఆట మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై శారీరక , భావోద్వేగ ఒత్తిడిని పెంచకూడదన్నారు. తరచూ కఠినమైన శిక్షణా పద్ధతుల కారణంగా బాధకు గురవుతాయని అన్నారు. కఠినమైన ఆటల స్థానంలో ”ఏనుగుల పోలో, ఏనుగుల ఫుట్బాల్” వంటి ఆటలను నైతిక వైల్డ్లైఫ్ టూరిజంలో భాగం చేయాలని సూచించారు. పర్యావరణ పర్యాటకంలో ప్రపంచ అగ్రగామిగా నేపాల్ ఎదగాలని ఆకాంక్షించారు. జాన్ అబ్రహాం పెటా- ఇండియా ప్రచారకర్తగా ఉన్న సంగతి తెలిసిందే.
Read Also:PV Sindhu Wedding: వివాహ బంధంలోకి పీవీ సింధు.. దీవి ప్రత్యేకతలు ఇవే!
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!