John Abraham : మూగజీవాల కోసం పిలుపునిచ్చిన స్టార్ హీరో
- మూగ జీవాలని రక్షించాలని జాన్ అబ్రహాం పిలుపు
- ఏనుగులను రక్షించాలంటూ నేపాల్ ప్రభుత్వానికి లేఖ
- చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్ నిర్వహించొద్దంటూ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
John Abraham : ఇటీవల కాలంలో మెగా కోడలు ఉపాసన తన ఐస్ ల్యాండ్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. వరుసగా దేశవిదేశాల్లో పర్యటిస్తున్న ఉపాసన ఐస్ ల్యాండ్ లో విహారయాత్రకు వెళ్లాల్సి ఉండగా.. తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడానికి కారణం.. అక్కడి ప్రభుత్వం 2000 తిమింగళాల్ని నిర్ధయగా చంపడానికి ఆదేశించడమేనని తెలిపారు. వేటగాళ్లకు లైసెన్సులు మంజూరు చేయాలని అధికారికంగా ఐస్ ల్యాండ్ ప్రభుత్వం ప్రకటించిన కారణంగా తన పర్యటనను రద్దు చేసుకున్నానని అన్నారు. ఉపాసన నిర్ణయాన్ని అభిమానులు మెచ్చకున్నారు. తనపై ప్రశంసలు వర్షం కురిపించారు. ఒక గొప్ప కాజ్(సామాజిక కారణం) కోసం తన టూర్ రద్దు చేసుకోవడాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు అలాంటి ఒక కాజ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం కూడా ముందుకు వచ్చారు. అడవుల్లో జీవించే తెలివైన, సున్నితమైన జంతువుల్లో ఏనుగులు ఉన్నాయి. వాటిని హింసించడం ఆపాలని ఆయన పిలుపు నిచ్చారు. జంతువులను మానసికంగా హింసిస్తూ శారీరక ఒత్తిడికి గురి చేయడం సరికాదన్నాడు. ఈ కారణంగా ‘చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్’ను రద్దు చేయాలని జాన్ అబ్రహం నేపాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు నేపాల్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖను పంపారు.
Read Also:YCP vs TDP: కుర్చీ కోసం వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నేటి సర్వసభ్య సమావేశంకు భారీ బందోబస్తు!
Also Read
- Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
చిత్వాన్ ఎలిఫెంట్ ఫెస్టివల్లో ఏనుగులను ఆటల పేరుతో ఒత్తిడికి గురి చేస్తున్నారని జాన్ అబ్రహాం అన్నారు. ఈ ఫెస్టివల్ కొందరికి ఆనందం కలిగించవచ్చు కానీ, ఏనుగులపై ఒత్తిడి ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నానని అన్నారు. ఏనుగులు తెలివైనవి.. ఇలాంటి సున్నితమైన జంతువులతో ఆట మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై శారీరక , భావోద్వేగ ఒత్తిడిని పెంచకూడదన్నారు. తరచూ కఠినమైన శిక్షణా పద్ధతుల కారణంగా బాధకు గురవుతాయని అన్నారు. కఠినమైన ఆటల స్థానంలో ”ఏనుగుల పోలో, ఏనుగుల ఫుట్బాల్” వంటి ఆటలను నైతిక వైల్డ్లైఫ్ టూరిజంలో భాగం చేయాలని సూచించారు. పర్యావరణ పర్యాటకంలో ప్రపంచ అగ్రగామిగా నేపాల్ ఎదగాలని ఆకాంక్షించారు. జాన్ అబ్రహాం పెటా- ఇండియా ప్రచారకర్తగా ఉన్న సంగతి తెలిసిందే.
Read Also:PV Sindhu Wedding: వివాహ బంధంలోకి పీవీ సింధు.. దీవి ప్రత్యేకతలు ఇవే!
తాజావార్తలు
-
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..