Site icon NTV Telugu

YS Jagan: కళ్లు మూసుకుని తెరిస్తే రెండేళ్లు గడిచాయి.. మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే వచ్చేది మన ప్రభుత్వమే..

Ys Jagan Speech

Ys Jagan Speech

మాజీ సీఎం వైఎస్ జగన్ జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కళ్లు మూసుకుంటే రెండేళ్లు గడిచాయి, మరో మూడేళ్లు కూడా ఇలానే కళ్లను మూసుకుంటే.. వచ్చేది మన ప్రభుత్వమే.. జగన్ 2.0లో అందరి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు.. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిన తీవ్రంగా ఖండించిన ఆయన.. జోగి రమేష్ ఇల్లు మొత్తం చిన్నాభిన్నం అయ్యింది. స్థానిక పోలీసులు, టీడీపీ నేతలు కలిసి ప్లాన్ చేసి దాడి చేశారు. దాడి సమయంలో, పోలీసులు సమక్షంలోనే నిప్పులు పెట్టారు. ఈ దాడిలో పాల్గొన్న టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ కు అత్యంత సన్నిహితులు అని జగన్ అన్నారు.

Read Also: Jana Nayagan Release Date: దళపతి ఫ్యాన్స్‌కు పూనకాలే.. జన నాయగన్ ‘గర్జన’కు డేట్ ఫిక్స్!

జోగి రమేష్ విచారణ కోసం హాజరైన సమయంలోనే ఈ దాడి జరిగింది. స్థానిక పోలీసులు మరియు సీపీ ఫోన్ కూడా అందుకోలేదు. ఇటువంటి పరిస్థితి అంబటి రాంబాబు ఇంటి దగ్గర జరిగిన దహనకాండ సమయంలో కూడా కనిపించిందన్నారు వైఎస్‌ జగన్.. NHRC నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి సమస్యను తీసుకెళ్తాం.. జోగి రమేష్‌పై ఇప్పటి వరకు 12 అక్రమ కేసులు నమోదయ్యాయి. కల్తీ మద్యం కేసులో ఆయనను జైల్లో కూడా పెట్టారు. వైఎస్ జగన్ చెప్పినట్లే, పోలీసులు మరియు వర్గాల సహకారంతో ఆయనపై రాజకీయ భయం, న్యాయ హరాస్మెంట్ కొనసాగుతోంది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దోషులను బోన్‌లో నిలబెడతామని హెచ్చరించారు వైఎస్‌ జగన్..

Exit mobile version