Site icon NTV Telugu

TSPSC : టీఎస్​పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్..

Tspsc

Tspsc

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే వరుసపెట్టి నోటిఫికేషన్‌లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. అయితే.. తాజాగా.. టీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ములుగు జిల్లాలోని అటవీ కళాశాలల్లో ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ కళాశాలల్లో 27 ఉద్యోగాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది. సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్​పీఎఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. గత ఐదు రోజుల క్రితం.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (DAO) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీ చేయనుంది. ఆగ‌స్టు 17 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ ను సందర్శించవచ్చు.

 

Exit mobile version