Jharkhand: ప్రియుడితో బెడ్రూంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ భార్య.. భర్త ఏం చేశాడంటే?
- భర్తను వదిలేసిన నలుగురు పిల్లల తల్లి
- ప్రియుడితో లివ్-ఇన్ రిలేషన్షిప్
- పిల్లలను సైతం పట్టించుకోని తల్లి
- కోపోద్రిక్తుడైన మహిళ భర్త
- రాత్రికి ప్రియుడి ఇంటికి వెళ్లి ఏం చేశాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి తర్వాత భార్యను భర్త.. భర్తను భార్య మోసం చేసుకోవడం ప్రస్తుతం కామన్గా మారింది. భర్త తన భార్యను మోసం చేయడం, భార్య వేరొకరి కోసం భర్తను మోసం చేయడం వంటి వార్తలు ప్రతిరోజూ అనేకం వస్తునే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్ జంషెడ్పూర్లోని ఆదిత్యపూర్ నగరం నుంచి ఇలాంటి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, నలుగురు పిల్లల తల్లి తన ఇంటిని వదిలి తన ప్రియుడి వద్దకు వెళ్లింది. ఆమె అతనితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో జీవించడం ప్రారంభించింది. కానీ.. ఆమె భర్త ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు.
READ MORE: Delhi Rain: ఢిల్లీలో ఈదురుగాలులతో భారీ వర్షం.. దెబ్బతిన్న అశోక్నగర్ మెట్రో స్టేషన్
Also Read
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
కులుపతంగ నివాసి భోలా అలియాస్ రితేష్ బిరువా (35), బాగ్బెడ నివాసి రాజేంద్ర మార్డి భార్య సీతా మార్డితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. సీత తన భర్తను విడిచిపెట్టి.. కులుప్తంగాలోని భోలా నివాసంలో అతనితో కలిసి నివసించడం ప్రారంభించింది. ఆమె తన నలుగురు పిల్లల గురించి కూడా పట్టించుకోలేదు. దీంతో సీత భర్త రాజేంద్ర చాలా బాధపడ్డాడు. ఆమెపై కోపంతో ప్రేమికుడి ఇంటికి రాత్రి సమయంలో నిశ్శబ్దంగా వచ్చాడు. ఆ మహిళ తన ప్రియుడితో కలిసి నిద్రపోతోంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త తన భార్య, ఆమె ప్రియుడిపై గొడ్డలితో దాడి చేశాడు.
READ MORE: ISRO: ఈ శాటిలైట్ ద్వారా పాకిస్తాన్ రాత్రి ఏం చేస్తుందో కూడా చూడొచ్చు.. రేపే ప్రయోగం..
ఈ దాడిలో ఆ మహిళ ప్రేమికుడు అక్కడికక్కడే మరణించాడు. కాగా, ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న.. పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ సింగ్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పంచనామా సిద్ధం చేసి.. పోస్ట్మార్టం కోసం పంపారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులను అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!