Nirmala Sitharaman: అసెంబ్లీలో జయలలిత చీర లాగి ఎగతాళి చేశారు.. డీఎంకేపై కేంద్ర మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitharaman: మణిపూర్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. డీఎంకే ఎంపీలు చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చే క్రమంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంశాన్ని ప్రస్తావించారు. భారతదేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై డీఎంకే నాయకురాలు కనిమొళి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ‘మణిపూర్, రాజస్థాన్ లేదా ఢిల్లీలో ఎక్కడైనా మహిళలు బాధపడుతున్నారని, దానిని మనం సీరియస్గా తీసుకోవాలని, అయితే ఇందులో రాజకీయాలు ఉండకూడదని అన్నారు.
1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత చీరను లాగిన సంఘటనను ఆమె వివరించారు. “ఆమె ప్రతిపక్ష నాయకురాలు. ఆమె(జయలలిత) అప్పటికీ సీఎం కాలేదు.. ప్రతిపక్ష నాయకురాలు. తమిళనాడు అసెంబ్లీలో జయలలిత చీర లాగి… డీఎంకే నవ్వుతూ, ఎగతాళి చేసింది. దీంతో ముఖ్యమంత్రి అయిన తర్వాతే తాను తిరిగి అసెంబ్లీకి వస్తానని జయలలిత ప్రమాణం చేశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాతే సభకు వచ్చారు’’ అని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నిరసన వ్యక్తం చేస్తున్న డీఎంకే సభ్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ‘‘మీరు కౌరవ సభ గురించి మాట్లాడుతున్నారు, ద్రౌపది గురించి మాట్లాడుతున్నారు, డీఎంకే జయలలితను మరిచిపోయిందా? నమ్మశక్యంగా లేదు.” అని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రసంగించారు.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
సెంగోల్ న్యాయానికి చిహ్నం
కేంద్రం హిందీని రుద్దేందుకు ప్రయత్నిస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి చేసిన మరో కామెంట్పై స్పందిస్తూ.. సిలపతిగారం స్ఫూర్తిని ప్రధానమంత్రి స్ఫూర్తిగా అమలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి అన్నారు. కాంగ్రెస్పై విరుచుకుపడిన ఆమె.. “సెంగోల్”.. న్యాయానికి చిహ్నంగా కొత్త పార్లమెంటులో అమర్చిన రాజదండమని.. “మర్చిపోయి మ్యూజియంలో ఉంచబడింది” అని అన్నారు. ఇది తమిళులను అవమానించడం కాదా అని ఆమె ప్రశ్నించారు. దేశంలోని పురాతన శైవ మఠాలలో ఒకటైన తమిళనాడులోని తిరువావడుతురై ఆధీనం ద్వారా భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు రాజదండం సమర్పించబడింది.
రూ.700 కోట్లు పెరిగింది.. రాష్ట్ర సర్కారు వల్లే..
తమిళనాడులోని మదురైలో ప్రతిపాదిత ఎయిమ్స్ ఆసుపత్రికి బడ్జెట్ రూ. 700 కోట్లు పెరిగిందని, భూసేకరణ ఆలస్యమైందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా డీఎంకే సభ్యుల నినాదాల మధ్య ఎంఎస్ సీతారామన్ మాట్లాడుతూ.. తమిళనాడు భూసేకరణ ఆలస్యం కావడంతో ప్రతిపాదిత ఆసుపత్రి బడ్జెట్ రూ. 1,200 కోట్ల నుంచి రూ. 1,900 కోట్లకు పెరిగిందన్నారు. ఆస్పత్రిని ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలంటూ డీఎంకే సభ్యులు తమిళంలో ‘ఎప్పో’ అంటూ నినాదాలు చేశారు. మంత్రి ఇంగ్లీషు, తమిళం రెండింటిలో సమాధానమిచ్చారు. ఎంఎస్ సీతారామన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే నిందలు వేయాలని, ఆలస్యానికి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవాలని చూస్తోందని అన్నారు. కరోనా సమయంలో సైట్ తనిఖీలు జరగలేదని, ఫలితంగా, వారు (రాష్ట్ర ప్రభుత్వం) పనిని వేగవంతం చేయలేకపోయారని ఆమె అన్నారు.
దేశఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం, వృద్ధి క్షీణత అనే జంట సవాళ్లతో పోరాడుతున్నప్పుడు భారతదేశం తన భవిష్యత్తు వృద్ధిపై ఆశాజనకంగా, సానుకూలంగా ఉండే ప్రత్యేక స్థితిలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రజలకు కలలను అమ్ముకునేవారని, ప్రస్తుత పాలనలో కలలు నెరవేరుతున్నాయని అన్నారు. “భారతదేశం 2013లో ప్రపంచంలోని ఐదు బలహీనమైన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉంది, కానీ ఇప్పుడు అది కేవలం తొమ్మిదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది” అని ఆమె చెప్పారు. 2004 నుండి 2014 వరకు ఉన్న పదవీకాలాన్ని ప్రస్తావిస్తూ గత యూపీఏ పాలన మొత్తం దశాబ్దాన్ని వృధా చేసిందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.
2022లో గ్లోబల్ ఎకానమీలో కేవలం మూడు శాతం మాత్రమే వృద్ధి నమోదైందని.. 2023లో అది 2.1 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.యూఎస్, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలు.. యూరో జోన్ సవాళ్ళను ఎదుర్కొంటున్నాయని, చైనా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా వినియోగదారుల డిమాండ్, వేతన స్తబ్దతకు సంబంధించిన తమ స్వంత సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆర్థిక మంత్రి చెప్పారు. 2013లో యూపీయే ప్రభుత్వం ఉన్నపుడు ప్రముఖ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత దేశాన్ని ప్రపంచంలో బలహీన ఆర్థిక వ్యవస్థలుగల ఐదు దేశాల్లో ఒకటిగా వర్గీకరించిందని చెప్పారు. కానీ ప్రస్తుత మోదీ పాలనలో భారత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని చెప్తూ, భారత దేశ రేటింగ్ను అప్గ్రేడ్ చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయని అన్నారు. ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘గరీబీ హటావో’ నినాదాన్ని ప్రస్తావిస్తూ, పేదరికాన్ని అసలు తొలగించగలరా అని ఆమె అడిగారు. ప్రధాని మోడీ దీనిని పూర్తిగా మార్చారు. మా పాలనలో పరివర్తన ఉందని ఆమె అన్నారు. “వస్తాయి, అందుతాయి” అని ప్రజలు గత ప్రభుత్వాల హయాంలో ఆశించేవారని, ప్రస్తుతం “వచ్చాయి. అందాయి’ అని ప్రజలు అంటున్నారని” కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?