Jasprit Bumrah: బుమ్రా పేరు వింటేనే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు స్టార్ట్ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒత్తిడి ఫీల్ అవ్వడు. ఓవర్లో ఆరు బాల్స్ సైతం యార్కర్ వేయగల సామర్థ్యం ఉన్న బౌలర్. “భారత్కు ఇలాంటి బౌలర్ ఉండటం అదృష్టం.” “ఇలాంటి బౌలర్ ప్రపంచంలోనే లేడు” అంటూ విదేశీ ప్లేయర్స్ నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఇక నిన్నటి మ్యాచ్ గురించి చెప్పనవసరం లేదు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం బుమ్రాకు సొంత అడ్డా. కానీ, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సరిగ్గా రాణించలేక పోయాడు. ఆ బాధ మనసులో అలాగే ఉండిపోయింది. అయితే, సరిగ్గా మూడేళ్ల తర్వాత అంటే నిన్న అదే స్టేడియంలో జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. న్యూజిలాండ్తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించడంలో బుమ్రా పాత్ర మరువలేనిది. తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన (4/15) కనబరిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
READ MORE: Hardik Pandya: గర్ల్ఫ్రెండ్ను ‘మిసెస్’గా పరిచయం చేసిన హార్దిక్.. గ్రౌండ్ లోనే ఇద్దరూ కలిసి?
ఇక ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యాడు. “గతంలో నా సొంత గడ్డపై జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలవలేక పోయాను. ఈ విక్టరీ నాకు చాలా స్పెషల్. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం చాలా శ్రమించాను. పక్కా ప్లాన్తో సంసిద్ధమయ్యాను. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని నాకు తెలుసు. నేను ఇక్కడే పెరిగాను. ఇక్కడే ప్రాక్టీస్ చేశాను. కాబట్టి నా అనుభవాన్ని పూర్తిగా పెట్టేశాను. దేవుడి దయ వల్ల అనుకున్న స్థాయిలో రాణించగలిగాను. ఈ పిచ్ గురించి నాకు బాగా తెలుసు. ఫాస్ట్ బౌలింగ్లో బ్యాటర్లు ఈజీగా షాట్ కొట్టేస్తారు. ఇతర జట్టు బౌలింగ్ ఎలా చేస్తున్నారో కూడా నేను చూశాను. అందుకే తెలివిగా పదే పదే బంతి వేగాన్ని మారుస్తూ వికెట్లు తీశాను.” అని బుమ్రా వివరించాడు.
READ MORE: Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియామకం
