NTV Telugu Site icon

Rats Eat Ganja: పోలీస్ స్టేషన్‌లో నిల్వ ఉంచిన గంజాయి, భాంగ్ తినేసిన ఎలుకలు.. జార్ఖండ్‌ పోలీసుల నివేదిక..!

8

8

జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్‌లో 10 కిలోల భాంగ్ మరియు తొమ్మిది కిలోల గంజాయిని ధ్వంసం చేసినందుకు ఎలుకలను నిందించారు. ఈ విషయాన్ని పోలీసులు జిల్లాలోని కోర్టుకు తెలియజేసినట్లు సంబంధిత కేసుకు సంబంధించిన న్యాయవాది ఆదివారం తెలిపారు. ఆరేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న భాంగ్, గంజాయిని సమర్పించాలని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారిని కోర్టు ఆదేశించడంతో పోలీసులు శనివారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రామ్ శర్మకు నివేదిక సమర్పించారు. పోలీసు స్టేషన్‌లో నిల్వ ఉంచిన మత్తు పదార్థాలను ఎలుకలు పూర్తిగా ధ్వంసం చేశాయని అధికారి తన నివేదికలో తెలిపారు. దీనికి సంబంధించి పోలీసు స్టేషన్‌లో నివేదిక కూడా నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

Also read: Family Star: దేవరకొండను కించపరుస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు..!

డిసెంబర్ 14, 2018న, రాజ్‌గంజ్ పోలీసులు 10 కిలోల భాంగ్, 9 కిలోల గంజాయితో శంభుప్రసాద్ అగర్వాల్ తోపాటు అతని కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. విచారణ సందర్భంగా., జప్తు చేసిన భాంగ్, గంజాయిని ఏప్రిల్ 6న కోర్టులో హాజరుపరచాలని కేసు దర్యాప్తు అధికారి జయప్రకాష్ ప్రసాద్‌ను కోర్టు ఆదేశించింది.

Also read: Prashant Kishor: రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుంటే మంచిది.. కాంగ్రెస్‌కి ప్రశాంత్ కిషోర్ సలహా..

కాకపోతే ఇందుకు గాను “జప్తు చేసిన వస్తువులన్నింటినీ ఎలుకలు ధ్వంసం చేశాయని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ దరఖాస్తుతో ప్రసాద్ శనివారం కోర్టుకు హాజరయ్యారు” అని ఈ కేసులో డిఫెన్స్ లాయర్ అభయ్ భట్ మీడియాకు తెలిపారు. జప్తు చేసిన వస్తువులను పోలీసులు ప్రదర్శించలేనందున, తన క్లయింట్‌ ను తప్పుడు కేసుల్లో ఇరికించినట్లు కనిపిస్తోందని భట్ అన్నారు.