Jaish-e-Mohammed fundraising: బీభత్సానికి నిధుల సేకరణ.. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రసంస్థ కొత్త ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaish-e-Mohammed fundraising: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) కోరలు తీసిన పాములా తయారైంది. ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ క్రమక్రమంగా తిరిగి బలం పుంజుకొని బీభత్సాన్ని సృష్టించడానికి కొత్త ప్లాన్ వేసింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఉగ్రసంస్థ రహస్యంగా నిధుల సేకరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. పాకిస్థాన్ అంతటా 3.91 బిలియన్ల PKRలను సేకరించడం ద్వారా 313 కొత్త మర్కజ్లను (శిక్షణా శిబిరాలు, సురక్షిత ప్రాంతాలు) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పని చేస్తోంది.
READ MORE: Udaya Bhanu : పవన్ కల్యాణ్ పక్కన సాంగ్ చేయనని చెప్పేశా.. యాంకర్ ఉదయభాను కామెంట్స్
Also Read
- Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Astrology: ఆగస్టు 01 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
ఈ ప్రచారానికి జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సోదరుడు తల్జా అల్ సైఫ్ నాయకత్వం వహించారు. ఈక్రమంలో వారు మద్దతుదారుల నుంచి పెద్ద మొత్తాల్లో విరాళాలు సేకరించారు. ఈ విరాళాలను FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) పరిశీలన నుంచి తప్పించడానికి ఈజీపైసా, సదాపే వంటి డిజిటల్ వాలెట్లను ఉపయోగించారు. ఈ డిజిటల్ వాలెట్లు మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొబైల్ నంబర్లతో రిజిస్టర్ అయ్యాయని దర్యాప్తులో తేలింది. ఈ నెంబర్లలో అతని సోదరుడు తల్జా అల్ సైఫ్, కుమారుడు అబ్దుల్లా అజార్ నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే పాకిస్థాన్లోని మసీదులలో గాజా పేరుతో విరాళాల వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. అయితే ఈ డబ్బును జైష్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
విరాళాలు సేకరిస్తున్న అల్ రెహమత్ ట్రస్ట్
అల్ రెహమత్ ట్రస్ట్ను స్వయంగా మసూద్ అజార్, తన సన్నిహితులు నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ బహావల్పూర్లోని ఒక బ్యాంకు ఖాతా ద్వారా నిధులు సేకరిస్తోంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేకరించిన నిధులతో మర్కజ్లో కొత్తగా నిర్మించిన సురక్షితమైన భవనాలు మసూద్ అజార్, అతని కుటుంబం ఉనికిని దాచి ఉంచడానికి విశేషంగా ఉపయోగపడుతున్నాయి. ఈ రహస్య స్థావరాలను కొత్త ఉగ్రవాదుల నియామకం, శిక్షణ కోసం కూడా ఉపయోగించాలని ఉగ్రవాద సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.
పలు నివేదికల ప్రకారం.. ఈ నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతమైందని తెలుస్తుంది. ఉగ్రసంస్థకు పాకిస్థాన్, విదేశాల నుంచి భారీ మొత్తంలో నిధులు సమకూరినట్లు స్పష్టం అవుతుంది. జైషే ఉగ్రసంస్థ ఈ నిధులతో మెషిన్ గన్స్, రాకెట్ లాంచర్లు, మోర్టార్ల వంటి ఆధునిక ఆయుధాలను కొనుగోలను చేసిందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. కొత్త ఆయుధాలు, విస్తరించిన మౌలిక సదుపాయాలతో జైష్-ఎ-మొహమ్మద్ ప్రపంచంపై కొత్త భీభత్సాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉందని నిఘా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అధునాతన రహస్య కమ్యూనికేషన్ సాయంతో ఉగ్రవాద సంస్థ నాయకులు వారిని గుర్తించబడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ నిఘా నీడకు దొరకడం లేదు.
READ MORE: Infosys bonus: గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్.. ఎంత బోనస్ ప్రకటించిందంటే..!
తాజావార్తలు
-
Jagapathi Babu: ఎవరూ నన్ను కొట్టలేదు.. అసలు నిజం చెప్పి ఊరట ఇచ్చిన జగ్గూభాయ్!
-
PM Modi: ‘తిట్లతో ఏ సమస్యా పరిష్కారం కాదు’.. తప్పుదారి పట్టిన యువతకు సరైన మార్గం చూపాలి.. ప్రధాని మోడీ కొత్త వీడియో..
-
Bhogapuram International Airport: నేడే భోగాపురం ఎయిర్పోర్ట్ జాతికి అంకితం.. మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
LPG Cylinder Price Cut: ఆగస్టు మొదటి రోజే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Astrology: ఆగస్టు 01 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!