Jaish-e-Mohammed fundraising: బీభత్సానికి నిధుల సేకరణ.. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రసంస్థ కొత్త ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaish-e-Mohammed fundraising: భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) కోరలు తీసిన పాములా తయారైంది. ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ క్రమక్రమంగా తిరిగి బలం పుంజుకొని బీభత్సాన్ని సృష్టించడానికి కొత్త ప్లాన్ వేసింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఉగ్రసంస్థ రహస్యంగా నిధుల సేకరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. పాకిస్థాన్ అంతటా 3.91 బిలియన్ల PKRలను సేకరించడం ద్వారా 313 కొత్త మర్కజ్లను (శిక్షణా శిబిరాలు, సురక్షిత ప్రాంతాలు) ఏర్పాటు చేయడం లక్ష్యంగా పని చేస్తోంది.
READ MORE: Udaya Bhanu : పవన్ కల్యాణ్ పక్కన సాంగ్ చేయనని చెప్పేశా.. యాంకర్ ఉదయభాను కామెంట్స్
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
ఈ ప్రచారానికి జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సోదరుడు తల్జా అల్ సైఫ్ నాయకత్వం వహించారు. ఈక్రమంలో వారు మద్దతుదారుల నుంచి పెద్ద మొత్తాల్లో విరాళాలు సేకరించారు. ఈ విరాళాలను FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) పరిశీలన నుంచి తప్పించడానికి ఈజీపైసా, సదాపే వంటి డిజిటల్ వాలెట్లను ఉపయోగించారు. ఈ డిజిటల్ వాలెట్లు మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొబైల్ నంబర్లతో రిజిస్టర్ అయ్యాయని దర్యాప్తులో తేలింది. ఈ నెంబర్లలో అతని సోదరుడు తల్జా అల్ సైఫ్, కుమారుడు అబ్దుల్లా అజార్ నంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే పాకిస్థాన్లోని మసీదులలో గాజా పేరుతో విరాళాల వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. అయితే ఈ డబ్బును జైష్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
విరాళాలు సేకరిస్తున్న అల్ రెహమత్ ట్రస్ట్
అల్ రెహమత్ ట్రస్ట్ను స్వయంగా మసూద్ అజార్, తన సన్నిహితులు నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ బహావల్పూర్లోని ఒక బ్యాంకు ఖాతా ద్వారా నిధులు సేకరిస్తోంది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేకరించిన నిధులతో మర్కజ్లో కొత్తగా నిర్మించిన సురక్షితమైన భవనాలు మసూద్ అజార్, అతని కుటుంబం ఉనికిని దాచి ఉంచడానికి విశేషంగా ఉపయోగపడుతున్నాయి. ఈ రహస్య స్థావరాలను కొత్త ఉగ్రవాదుల నియామకం, శిక్షణ కోసం కూడా ఉపయోగించాలని ఉగ్రవాద సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.
పలు నివేదికల ప్రకారం.. ఈ నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతమైందని తెలుస్తుంది. ఉగ్రసంస్థకు పాకిస్థాన్, విదేశాల నుంచి భారీ మొత్తంలో నిధులు సమకూరినట్లు స్పష్టం అవుతుంది. జైషే ఉగ్రసంస్థ ఈ నిధులతో మెషిన్ గన్స్, రాకెట్ లాంచర్లు, మోర్టార్ల వంటి ఆధునిక ఆయుధాలను కొనుగోలను చేసిందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. కొత్త ఆయుధాలు, విస్తరించిన మౌలిక సదుపాయాలతో జైష్-ఎ-మొహమ్మద్ ప్రపంచంపై కొత్త భీభత్సాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉందని నిఘా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అధునాతన రహస్య కమ్యూనికేషన్ సాయంతో ఉగ్రవాద సంస్థ నాయకులు వారిని గుర్తించబడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ నిఘా నీడకు దొరకడం లేదు.
READ MORE: Infosys bonus: గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్.. ఎంత బోనస్ ప్రకటించిందంటే..!
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!