Jagapathi Babu on Real Estate Advertising: టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్థిరాస్తి (రియల్ ఎస్టేట్) రంగానికి సంబంధించి తానూ మోసపోయానని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. వాళ్ల ట్రాప్లో ఎవరూ పడకూడదని జగపతి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జగపతి బాబు ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘రియల్ ఎస్టేట్లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా విషయంలో హెచ్చరించారు. ఇటీవల నేను ఓ రియల్ ఎస్టేట్ యాడ్లో నటించా. వారు నన్నూ మోసం చేశారు. వారెవరు?, ఏం జరిగింది? అన్నది త్వరలోనే మీకు చెబుతా. ల్యాండ్ కొనేముందు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకోండి. ఎవరి ట్రాప్లో మీరు పడకండి’ అని జగపతి బాబు సూచించారు. జగపతి బాబు ఎలా మోసపోయారు అని ఫాన్స్ చర్చించుకుంటున్నారు.
Also Read: Rishabh Pant: జనం చూస్తే ఎలా అని భయపడ్డాను: పంత్
టాలీవుడ్లో ఒకప్పుడు జగపతి బాబు హీరోగా వెలిగారు. ఎన్నో హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉండేది. అయితే వరుస ఫ్లాప్స్ పడడంతో రేసులో వెనుకబడిపోయారు. అడపాదడపా హిట్లు కొట్టినా.. నిలదొక్కుకోలేకపోయారు. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం దూసుకుపోతున్నారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పుష్ప 2, మిస్టర్ బచ్చన్ చిత్రాల్లో జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.