LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్విట్టర్ (ప్రస్తుత X) సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ‘బ్లాక్’ (Black) సీఈఓ జాక్ డోర్సే మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన సంస్థ బ్లాక్లో సుమారు 4,000 మంది ఉద్యోగులను తొలగించిన (లేఆఫ్స్) ఆయన.. ఇప్పుడు కంపెనీల్లోని ‘మిడిల్ మేనేజ్మెంట్’ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్య స్థాయి ఉద్యోగుల అవసరం ఇకపై ఉండబోదని.. ఆ బాధ్యతలను కృత్రిమ మేధ (AI)తో భర్తీ చేయాలని ఆయన ఇతర టెక్ కంపెనీలకు సూచించారు.
ఎందుకీ నిర్ణయం..?
జాక్ డోర్సే అభిప్రాయం ప్రకారం.. ఒక సంస్థలో మిడిల్ మేనేజ్ మెంట్ కేవలం సమాచారాన్ని పైస్థాయి నుంచి కింది స్థాయికి చేరవేసే వారుగానే మిగిలిపోతున్నారు. దీనివల్ల పనిలో వేగం తగ్గడమే కాకుండా, కంపెనీపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇలాంటి పునరావృతమయ్యే పనులను ఏఐ చాలా సమర్థవంతంగా.. వేగంగా, తక్కువ ఖర్చుతో చేయగలదని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.
Also Read
- England vs India: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా..
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
- Team India: మెగా టోర్నీల్లో మొనగాళ్లు.. ద్విపాక్షిక సిరీస్ల్లో వైఫల్యాలు..1983 - 1985 హిస్టరీ రిపీట్!
Also Read:Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..
బ్లాక్ సంస్థలో భారీ మార్పులు…
డోర్సే తన పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’లో ఇప్పటికే భారీ మార్పులు చేపట్టారు. సమర్థతను పెంచేందుకు, అదనపు ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే కాకుండా, మిగిలిన పనిని ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నారు.
ఉద్యోగ భద్రతపై ఆందోళన..
జాక్ డోర్సే సూచనలు టెక్ నిపుణులలో చర్చకు దారితీశాయి. ఒకవైపు ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని టెక్ దిగ్గజాలు వాదిస్తుంటే.. మరోవైపు అనుభవజ్ఞులైన మధ్య స్థాయి ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కేవలం కోడింగ్ లేదా మేనేజ్మెంట్ మాత్రమే కాకుండా.. ఏఐని నియంత్రించే నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి.. టెక్ రంగం కేవలం ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా.. సంపూర్ణంగా ఏఐ ఆధారిత పని వైపు వేగంగా అడుగులు వేస్తోందని డోర్సే మాటలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
England vs India: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా..
-
Harry Brook: టీమిండియా ఓడిపోతుంటే ఫుల్ హ్యాపీగా ఉంది.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
-
Prabhas : ‘ఫౌజీ’ బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
-
Cyber Fraud: సైబర్ నేరగాళ్ల కొత్త ట్రెండ్.. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్ గా.!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!