LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్విట్టర్ (ప్రస్తుత X) సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ‘బ్లాక్’ (Black) సీఈఓ జాక్ డోర్సే మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన సంస్థ బ్లాక్లో సుమారు 4,000 మంది ఉద్యోగులను తొలగించిన (లేఆఫ్స్) ఆయన.. ఇప్పుడు కంపెనీల్లోని ‘మిడిల్ మేనేజ్మెంట్’ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్య స్థాయి ఉద్యోగుల అవసరం ఇకపై ఉండబోదని.. ఆ బాధ్యతలను కృత్రిమ మేధ (AI)తో భర్తీ చేయాలని ఆయన ఇతర టెక్ కంపెనీలకు సూచించారు.
ఎందుకీ నిర్ణయం..?
జాక్ డోర్సే అభిప్రాయం ప్రకారం.. ఒక సంస్థలో మిడిల్ మేనేజ్ మెంట్ కేవలం సమాచారాన్ని పైస్థాయి నుంచి కింది స్థాయికి చేరవేసే వారుగానే మిగిలిపోతున్నారు. దీనివల్ల పనిలో వేగం తగ్గడమే కాకుండా, కంపెనీపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇలాంటి పునరావృతమయ్యే పనులను ఏఐ చాలా సమర్థవంతంగా.. వేగంగా, తక్కువ ఖర్చుతో చేయగలదని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.
Also Read
- Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
Also Read:Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..
బ్లాక్ సంస్థలో భారీ మార్పులు…
డోర్సే తన పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’లో ఇప్పటికే భారీ మార్పులు చేపట్టారు. సమర్థతను పెంచేందుకు, అదనపు ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే కాకుండా, మిగిలిన పనిని ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నారు.
ఉద్యోగ భద్రతపై ఆందోళన..
జాక్ డోర్సే సూచనలు టెక్ నిపుణులలో చర్చకు దారితీశాయి. ఒకవైపు ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని టెక్ దిగ్గజాలు వాదిస్తుంటే.. మరోవైపు అనుభవజ్ఞులైన మధ్య స్థాయి ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కేవలం కోడింగ్ లేదా మేనేజ్మెంట్ మాత్రమే కాకుండా.. ఏఐని నియంత్రించే నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి.. టెక్ రంగం కేవలం ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా.. సంపూర్ణంగా ఏఐ ఆధారిత పని వైపు వేగంగా అడుగులు వేస్తోందని డోర్సే మాటలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!