LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్విట్టర్ (ప్రస్తుత X) సహ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ‘బ్లాక్’ (Black) సీఈఓ జాక్ డోర్సే మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన సంస్థ బ్లాక్లో సుమారు 4,000 మంది ఉద్యోగులను తొలగించిన (లేఆఫ్స్) ఆయన.. ఇప్పుడు కంపెనీల్లోని ‘మిడిల్ మేనేజ్మెంట్’ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్య స్థాయి ఉద్యోగుల అవసరం ఇకపై ఉండబోదని.. ఆ బాధ్యతలను కృత్రిమ మేధ (AI)తో భర్తీ చేయాలని ఆయన ఇతర టెక్ కంపెనీలకు సూచించారు.
ఎందుకీ నిర్ణయం..?
జాక్ డోర్సే అభిప్రాయం ప్రకారం.. ఒక సంస్థలో మిడిల్ మేనేజ్ మెంట్ కేవలం సమాచారాన్ని పైస్థాయి నుంచి కింది స్థాయికి చేరవేసే వారుగానే మిగిలిపోతున్నారు. దీనివల్ల పనిలో వేగం తగ్గడమే కాకుండా, కంపెనీపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఇలాంటి పునరావృతమయ్యే పనులను ఏఐ చాలా సమర్థవంతంగా.. వేగంగా, తక్కువ ఖర్చుతో చేయగలదని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
Also Read:Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..
బ్లాక్ సంస్థలో భారీ మార్పులు…
డోర్సే తన పేమెంట్స్ సంస్థ ‘బ్లాక్’లో ఇప్పటికే భారీ మార్పులు చేపట్టారు. సమర్థతను పెంచేందుకు, అదనపు ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే కాకుండా, మిగిలిన పనిని ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నారు.
ఉద్యోగ భద్రతపై ఆందోళన..
జాక్ డోర్సే సూచనలు టెక్ నిపుణులలో చర్చకు దారితీశాయి. ఒకవైపు ఏఐ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని టెక్ దిగ్గజాలు వాదిస్తుంటే.. మరోవైపు అనుభవజ్ఞులైన మధ్య స్థాయి ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కేవలం కోడింగ్ లేదా మేనేజ్మెంట్ మాత్రమే కాకుండా.. ఏఐని నియంత్రించే నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి.. టెక్ రంగం కేవలం ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా.. సంపూర్ణంగా ఏఐ ఆధారిత పని వైపు వేగంగా అడుగులు వేస్తోందని డోర్సే మాటలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!