హైదరాబాద్ లో ఐటీ శాఖ అధికారుల దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్సేల్ వ్యాపారం చేసే బిజినెస్మెన్లే టార్గెట్గా ఐటి దాడులు నిర్వహించారు. ఇవాళ ఉదయమే నగరంలోని పలు ప్రాంతాలలో బంగారు వ్యాపారాల ఇండ్లపై దాడులు చేశారు ఐటి శాఖ అధికారులు.. బంగారం హోల్సేల్ లావాదేవీలపై ఆరాతీశారు. కొనుగోలు అమ్మకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంగారం వ్యాపారంపై దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ డీటెయిల్స్ తీసుకున్నారు. గత ఐదేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు అధికారులు. హైదరాబాదులోని క్యాప్స్ గోల్డ్ కంపెనీ పై ఐటి సోదాలు.. 15 చోట్ల సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ..
Also Read:VRS: .. 20ఏళ్ల సర్వీస్ ఉండి వీఆర్ఎస్ తీసుకుంటే.. దీనికి మీరు అర్హులే..
హైదరాబాద్, వరంగల్, విజయవాడలో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేస్తున్న క్యాప్స్ గోల్డ్ కంపెనీ… బంగారం కొనుగోలు చేసి రిటైల్ గోల్డ్ షాప్స్ కు అమ్ముతున్న క్యాప్స్ గోల్డ్ కంపెనీ.. క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్సేల్ గా ఉన్న సంస్థలపై ఐటి సోదాలు నిర్వహించింది. బంజారా హిల్స్ లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు.. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకులు పాల్పడ్డట్టు గుర్తించారు అధికారులు.
Also Read:Aarogyasri: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్.. సామాన్య ప్రజల అవస్థలు!!
బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు ఐటీ సంస్థ గుర్తించింది.. పెద్ద మొత్తంలో బంగారం బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నట్లు గుర్తింపు.. క్యాప్స్ స్పాట్ పేరుతో బులియన్ ట్రేడింగ్ చేస్తున్న క్యాప్స్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. బంగారం, వెండి హోల్ సేల్ మార్కెట్లో క్యాప్స్ గోల్డ్ ది అత్యధిక వాటా.. సికింద్రాబాద్ లోని సోమసుందరం స్ట్రీట్ లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు.. క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో ఐటీ శాఖకు చెందిన మూడు టీమ్ లు.. డైరెక్టర్ శ్రీనివాస్ నిర్వహిస్తున్న క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో సోదాలు.. గతంలో నోట్ల మార్పిడి సందర్భంలోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.
