Site icon NTV Telugu

IPL Winner 2025 RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. IPL 2025 విజేతగా ఆర్సీబి..!

Ipl Winner 2025 Rcb

Ipl Winner 2025 Rcb

గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ ఎట్టకేలకు ముగిసింది. నేడు జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 పరుగులతో విజయం సాధించింది. దీనితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

Read Also: Infinix GT 30 Pro: 6.78-అంగుళాల స్క్రీన్, 108MP కెమెరా, అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో ఇన్‌ఫినిక్స్ GT 30 ప్రో లాంచ్..!

టాస్ కోల్పోయిన బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది. టాప్ ఆర్డర్‌ నుంచి మంచి ఆరంభం లభించగా, మధ్యలో కీలక వికెట్లు కోల్పోయారు. విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రాజత్ పటీదార్ (26), లివింగ్‌స్టోన్ (25), జితేశ్ శర్మ (24) మెరుగైన స్కోర్లు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-40-3), కైల్ జేమిసన్ (4-0-48-3) బెస్ట్ ఫిగర్లు నమోదు చేశారు. ఆఖరి ఓవర్లలో వరుసగా వికెట్లు తక్కువ స్కోరుకే పరిమితమైంది.

Read Also: IPL 2025 Final Live Updates: పంజాబ్ vs ఆర్సీబీ మధ్య హైఓల్టేజ్‌.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్..

పంజాబ్ 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (24), ప్రభ్ సిమ్రన్ సింగ్ (26) పర్వాలేదనిపించారు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు చేసి ఆశలు పెట్టాడు. అయితే మిడిల ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్ (1), వాధేరా (15), స్టోయినిస్ (6) త్వరగా వెనుదిరగడంతో ఆర్సీబి వైపు మొగ్గు చూపుంది. చివర్లో శశాంక్ సింగ్ ధాటిగా ఆడుతూ 30 బంతుల్లో 61 పరుగులు (3 ఫోర్లు, 6 సిక్సర్లు) చేశాడు కానీ విజయం అందుకోలేకపోయారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా (4-0-17-2), భువనేశ్వర్ కుమార్ (4-0-38-2) కీలక వికెట్లు తీశారు. యాష్ దయాల్, షెఫర్డ్ చెరో వికెట్ తీసారు.

Exit mobile version