Site icon NTV Telugu

Tummala Nageswara Rao : హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ రైస్ సమ్మిట్.. తెలంగాణకు గర్వకారణం

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

శుక్రవారం, శనివారం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ రైస్ సమ్మిట్ జరుగుతోందని, 22 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సదస్సులు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కమిడిటీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ జరుగుతోంద ఆయన వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొట్టమొదటి సారిగా భారతదేశంలో మన హైదరాబాదులో ఈ సమ్మిట్ నిర్వహించటానికి నిర్ణయించుకున్నారని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 150 ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారని, వివిధ దేశాల వరి ఎగుమతి దిగుమతి దారులతోపాటు వరి వంగడాల పరిశోధకులు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

భారతదేశం నుంచి సీడ్ కంపెనీల ప్రతినిధులు,రైస్ మిల్లర్లు అభ్యుదయ రైతులు, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ పాల్గొనబోతున్నారని, ఈ సదస్సు వల్ల తెలంగాణలో వరి పండించే రైతులకు మేలు జరిగే విధంగా దిగుబడినిచ్చే వంగడాలపై పలు సూచనలు చేయనున్నారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ రకం వరి ధాన్యనికి డిమాండ్ ఉందో రైతులకు అవగాహన కల్పించనున్నారని, విత్తనోత్పత్తిలో ఆధునిక పరిజ్ఞానంపై చర్చించనున్నారని మంత్రి తుమ్మల అన్నారు. ప్రపంచంలో 100 దేశాలకు భారత్ నుంచి రైస్ ఎగుమతి జరుగుతుందని, రేపు ఉదయం తాజ్ కృష్ణ హోటల్లో 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కార్యక్రమం జరగబోతోందన్నారు మంత్రి తుమ్మల అన్నారు. ఈ సదస్సులో నాతో పాటు సివిల్ సప్లై అండ్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పాల్గొనబోతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు.

Exit mobile version