Intel : ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలనీ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు లేఆఫ్లు ప్రకటించాయి. అయితే మరో టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ మాత్రం అన్ని కంపెనీల కంటే వినూత్నంగా ఆలోచించింది. ఉద్యోగులను విధుల నుంచి తీసేయకుండా వారి వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. దీంతో కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు జీతాలో కోత పడుతుంది. ఈ నిబంధనలకు తక్షణమే అమలు చేయాలని భావిస్తోంది. సీఈవో, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు కోత నిబంధన అమలు చేయనున్నట్లు ఇంటెల్ అధికార ప్రతినిధి తెలిపారు.
Read Also: Talasani Srinivas Yadav: ఇకపై చెప్పడం ఉండదు సీరియస్ యాక్షన్ తీసుకుంటాము
ఇంటెల్ నిర్ణయంతో ఆ సంస్థ సీఈవో పాట్ గెల్సింగర్ వేతనంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం కోత విధిస్తారు. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది. సంస్థ భవిష్యత్తుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కంపెనీలన్నీ వరుసగా ఉద్యోగులను తొలగిస్తున్న ఈ తరుణంలో.. ఇంటెల్ భిన్నంగా ఆలోచించడాన్ని నిపుణులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేతనం కొంత తగ్గినా పర్వాలేదు కానీ ఉన్నపళంగా ఉద్యోగం పోతే కష్టమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటెల్ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందేనంటూ చెప్పుకుంటున్నారు.
Read Also: Tollywood: మరో సీనియర్ దర్శకుడిని కోల్పోయిన టాలీవుడ్