Gold Mines in India: గుడ్ న్యూస్.. త్వరలో మన దేశంలోనే బంగారం గని ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Mines in India: భారతదేశంలో బంగారం వినియోగానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం సామాన్యులు వేల టన్నుల బంగారాన్ని కొంటారు. ఈ భారీ డిమాండ్ను తీర్చడానికి భారత్ బయటి నుండి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి. ఇప్పుడు త్వరలో ఈ పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించవచ్చు. దేశంలోనే బంగారం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ త్వరలో పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. భారతదేశంలోని మొట్టమొదటి పెద్ద బంగారు గనిలో ఉత్పత్తి వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ 2024 నాటికి జోనగిరి గోల్డ్ ప్రాజెక్ట్లో పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించవచ్చని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఆపరేషన్ కొనసాగుతోంది.
ప్రతేడాది ఎంత ఉత్పత్తి అవుతుందంటే?
జోనగిరి గోల్డ్ ప్రాజెక్ట్లో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే.. ప్రతి సంవత్సరం 750 కిలోల బంగారం అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇప్పటి వరకు దాదాపు రూ.200 కోట్ల మేర ఈ గనిలో పెట్టుబడులు పెట్టగా ప్రస్తుతం అక్కడ నెలకు సుమారు కిలో బంగారం ఉత్పత్తి అవుతోంది. గనిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ ఆకాంక్షించారు.
Also Read
Read Also:YSRCP Representatives Meeting: వైసీపీ ప్రతినిధుల సభ లైవ్.. సీఎం కీలక ఆదేశాలు
ఏకైక లిస్టెడ్ కంపెనీ
ఈ బంగారు గనులు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఉన్నాయి. జోనగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల చుట్టూ ఉన్నాయి. ఈ గని 2013 సంవత్సరంలో ఆమోదించబడింది. అక్కడ బంగారాన్ని కనుగొనడానికి కంపెనీకి 8-10 సంవత్సరాలు పట్టింది. జోనగిరి గోల్డ్ మైన్స్ను జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. ఇందులో డెక్కన్ గోల్డ్ మైన్స్ 40 శాతం వాటాను కలిగి ఉంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ దేశంలోనే మొదటి, ఇప్పటివరకు బీఎస్ఈలో జాబితా చేయబడిన ఏకైక బంగారు అన్వేషణ సంస్థ.
కిర్గిస్థాన్లో కూడా బంగారు గని
డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్కు దేశం వెలుపల కూడా బంగారు గనులు ఉన్నాయి. ఈ విషయమై ఎండీ ప్రసాద్ మాట్లాడుతూ.. కిర్గిజ్స్థాన్లో ఉన్న గోల్డ్ మైన్ ప్రాజెక్ట్లో కంపెనీకి 60 శాతం వాటా ఉందన్నారు. అక్కడ కూడా వచ్చే ఏడాది అక్టోబర్-నవంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కిర్గిజ్స్థాన్లోని ఆల్టిన్ టోర్ గోల్డ్ ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరం 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది.
Read Also:Bhagavanth Kesari Trailer: దసరా దావత్ షురూ.. ఓరుగల్లు గడ్డపై బాలయ్యబాబుకు తలకాయ కూర!
తాజావార్తలు
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!