NTV Telugu Site icon

Paris Olympics 2024: సెమీస్‌కి చేరిన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్..

Aman Sehrawat

Aman Sehrawat

2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీల రెజ్లింగ్‌లో భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నాడు.అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబాకరోవ్‌పై సెహ్రావత్ 12-0తో విజయం సాధించాడు. తన ప్రత్యర్థికి పోరాటాన్ని ప్రారంభించడానికి ఏ మాత్రం సమయం ఇవ్వలేదు. 2024 పారిస్ గేమ్స్‌లో భారతదేశపు పురుష రెజ్లరలో అమన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కాగా.. సెమీ ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాత్రి 9.45 గంటలకు జరగనుంది.