Site icon NTV Telugu

Indian Railways: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో నాసిరకం ఆహారం.. ఐఆర్‌సీటీసీకి రూ. 50 లక్షల జరిమానా

Irctc Fine

Irctc Fine

రైళ్లలో అందించే ఆహార పదార్థాల క్వాలిటీ విషయంలో ఇదివరకు చాలా మంది ప్రయాణికులు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించే ఆహార నాణ్యతకు సంబంధించి భారతీయ రైల్వే కీలక చర్య తీసుకుంది. పాట్నా నుండి టాటానగర్ వరకు ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించే ఆహార నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, రైల్వే తన సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌పై రూ.10 లక్షల జరిమానా విధించింది.

Also Read:Yadadri: భార్యపై కోపం.. కన్న కూతురిని పొట్టన పెట్టుకున్న కసాయి తండ్రి..

నివేదికల ప్రకారం, 2026 మార్చి 15న, పాట్నా-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 21896లోని ఒక ప్రయాణికుడు ఫుడ్ క్వాలిటీపై ఫిర్యాదు చేశారు. రైల్వే ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి, విచారణ అనంతరం చర్య తీసుకుంది. రైల్వే ఐఆర్‌సిటిసిపై రూ.10 లక్షల జరిమానా విధించింది. అదనంగా, సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై రూ.50 లక్షల జరిమానా విధించింది. ఆ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

Also Read:CM Chandrababu: కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం.. ఇండియన్ కలినరీ ఇనిస్టిట్యూట్ తో పర్యాటకశాఖ ఎంఓయూ..!

ప్రయాణీకుల భద్రత, అందించే సేవల నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని రైల్వే ప్రతినిధి తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం లేదా ప్రమాణాల ఉల్లంఘనను సహించబోమని తెలిపారు. భారతీయ రైల్వే తన విస్తారమైన నెట్‌వర్క్ ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తుంది. ఐఆర్‌సిటిసి ప్రతిరోజూ 15 లక్షల మందికి పైగా ప్రయాణీకులకు భోజనం అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌బోర్డ్ ఫుడ్ ఆపరేషన్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ఇంత పెద్ద నెట్‌వర్క్‌లో నాణ్యతను కాపాడుకోవడం అత్యంత కీలకమని రైల్వే శాఖ నొక్కి చెబుతోంది. అందువల్ల, ఫిర్యాదు అందిన వెంటనే తక్షణమే చర్యలు తీసుకుంటారు. ఈ ఘటన నేపథ్యంలో, ప్రయాణికుల సౌకర్యం, భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని రైల్వే స్పష్టం చేసింది.

Exit mobile version