America: దేవ్ కమాల్ కియా.. స్పెల్లింగ్ చెప్పాడు.. 42లక్షలు కొట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: భారతీయ సంతతికి చెందిన 14 ఏళ్ల చిన్నారి అమెరికాలో అద్భుతం చేశాడు. ఇక్కడ జరిగిన పోటీలో 11 అక్షరాల పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పడం ద్వారా అతను 50 వేల డాలర్లు అంటే రూ.41.17 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. చిన్నారి పేరు దేవ్ షా. అతను తన తల్లిదండ్రులతో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. గురువారం రాత్రి, దేవ్ 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో పాల్గొన్నాడు. ఈ సమయంలో అతనిని ‘ప్సామ్మోఫైల్’ (psammophile) అనే పదం స్పెల్లింగ్ అడిగారు. ఈ 11 అక్షరాల పదాన్ని సరిగ్గా స్పెల్లింగ్ చెప్పి చరిత్ర సృష్టించిన చిన్నారి ఈ ఏడాది పోటీలో ఛాంపియన్గా నిలిచాడు. గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ ఇది.
Read Also: Post Office: రూ.5లక్షలు డిపాజిట్ చేయండి.. వడ్డీ రూ.2.25లక్షలు పొందండి
Also Read
- CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
- Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
- Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
- Musi Riverfront Project: రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతి.. 21 కి.మీ. మేర అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్.!
ఈ పోటీలో దేవ్ షా 22వ విజేత
ఈ పోటీలో దేవ్ షా 22వ విజేత. అతను 2019, 2021వ సంవత్సరాల్లో కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాడు. 2023 సంవత్సరంలో ఈ పోటీలో మొత్తం కోటి 10 లక్షల మంది పాల్గొన్నారు. అయితే 11 మంది పోటీదారులు మాత్రమే ఫైనల్స్కు చేరుకోగలిగారు. ఈ 11 మంది కంటెస్టెంట్స్లో దేవ్ షా ఒక్కడే అఖండ విజయం సాధించాడు. ఈ సందర్భంలో దేవ్ షా తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనవుతుండగా, దేవ్ షా మాత్రం తన కాళ్లు వణికిపోతున్నాయని అన్నారు.
Read Also: Sharwanand: హల్దీ ఫంక్షన్.. సందడంతా పెళ్లి కొడుకుదే
ఏళ్ల తరబడి భారతీయ అమెరికన్లదే ఆధిపత్యం
ఈ పోటీల ప్రాథమిక దశలు మంగళవారం జరుగగా, బుధవారం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్లు జరిగాయి. నేషనల్ స్పెల్లింగ్ బీని 1925లో ప్రారంభించారు. ఏళ్ల తరబడి భారతీయ అమెరికన్లదే ఆధిపత్యం. 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు.
గత ఏడాది కూడా భారతీయ అమెరికన్లదే విజయం
ఈ పోటీ 2020 సంవత్సరంలో రద్దు చేయబడింది. ఆ సమయంలో కరోనా ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. దీని తర్వాత, 2021 సంవత్సరంలో, ఈ పోటీని కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించారు. గతేడాది కూడా టెక్సాస్కు చెందిన భారతీయ అమెరికన్ హరిణి లోగన్ విజయం సాధించారు. అతను మరో భారతీయ అమెరికన్ విక్రమ్ రాజును ఓడించాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం..!
-
Tirumala: తిరుమలలో తలనీలాలు సమర్పించే ఆచారం ఎలా మొదలైంది.. దాని వెనుక ఉన్న పురాణం ఏంటి?
-
Monsoon Hair Care Tips: వర్షంలో జుట్టు తడిసిందా..? ఇలా చేస్తే చాలు జుట్టు రాలదు..
-
PM Modi: భారత్కు రూ.3,311 కోట్ల భారీ పెట్టుబడులు.. ఆస్ట్రేలియన్ సూపర్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోడీ
-
Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!