America: దేవ్ కమాల్ కియా.. స్పెల్లింగ్ చెప్పాడు.. 42లక్షలు కొట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: భారతీయ సంతతికి చెందిన 14 ఏళ్ల చిన్నారి అమెరికాలో అద్భుతం చేశాడు. ఇక్కడ జరిగిన పోటీలో 11 అక్షరాల పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పడం ద్వారా అతను 50 వేల డాలర్లు అంటే రూ.41.17 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. చిన్నారి పేరు దేవ్ షా. అతను తన తల్లిదండ్రులతో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. గురువారం రాత్రి, దేవ్ 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో పాల్గొన్నాడు. ఈ సమయంలో అతనిని ‘ప్సామ్మోఫైల్’ (psammophile) అనే పదం స్పెల్లింగ్ అడిగారు. ఈ 11 అక్షరాల పదాన్ని సరిగ్గా స్పెల్లింగ్ చెప్పి చరిత్ర సృష్టించిన చిన్నారి ఈ ఏడాది పోటీలో ఛాంపియన్గా నిలిచాడు. గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ ఇది.
Read Also: Post Office: రూ.5లక్షలు డిపాజిట్ చేయండి.. వడ్డీ రూ.2.25లక్షలు పొందండి
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
ఈ పోటీలో దేవ్ షా 22వ విజేత
ఈ పోటీలో దేవ్ షా 22వ విజేత. అతను 2019, 2021వ సంవత్సరాల్లో కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాడు. 2023 సంవత్సరంలో ఈ పోటీలో మొత్తం కోటి 10 లక్షల మంది పాల్గొన్నారు. అయితే 11 మంది పోటీదారులు మాత్రమే ఫైనల్స్కు చేరుకోగలిగారు. ఈ 11 మంది కంటెస్టెంట్స్లో దేవ్ షా ఒక్కడే అఖండ విజయం సాధించాడు. ఈ సందర్భంలో దేవ్ షా తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనవుతుండగా, దేవ్ షా మాత్రం తన కాళ్లు వణికిపోతున్నాయని అన్నారు.
Read Also: Sharwanand: హల్దీ ఫంక్షన్.. సందడంతా పెళ్లి కొడుకుదే
ఏళ్ల తరబడి భారతీయ అమెరికన్లదే ఆధిపత్యం
ఈ పోటీల ప్రాథమిక దశలు మంగళవారం జరుగగా, బుధవారం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్లు జరిగాయి. నేషనల్ స్పెల్లింగ్ బీని 1925లో ప్రారంభించారు. ఏళ్ల తరబడి భారతీయ అమెరికన్లదే ఆధిపత్యం. 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు.
గత ఏడాది కూడా భారతీయ అమెరికన్లదే విజయం
ఈ పోటీ 2020 సంవత్సరంలో రద్దు చేయబడింది. ఆ సమయంలో కరోనా ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. దీని తర్వాత, 2021 సంవత్సరంలో, ఈ పోటీని కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించారు. గతేడాది కూడా టెక్సాస్కు చెందిన భారతీయ అమెరికన్ హరిణి లోగన్ విజయం సాధించారు. అతను మరో భారతీయ అమెరికన్ విక్రమ్ రాజును ఓడించాడు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..