America: దేవ్ కమాల్ కియా.. స్పెల్లింగ్ చెప్పాడు.. 42లక్షలు కొట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: భారతీయ సంతతికి చెందిన 14 ఏళ్ల చిన్నారి అమెరికాలో అద్భుతం చేశాడు. ఇక్కడ జరిగిన పోటీలో 11 అక్షరాల పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పడం ద్వారా అతను 50 వేల డాలర్లు అంటే రూ.41.17 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. చిన్నారి పేరు దేవ్ షా. అతను తన తల్లిదండ్రులతో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. గురువారం రాత్రి, దేవ్ 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో పాల్గొన్నాడు. ఈ సమయంలో అతనిని ‘ప్సామ్మోఫైల్’ (psammophile) అనే పదం స్పెల్లింగ్ అడిగారు. ఈ 11 అక్షరాల పదాన్ని సరిగ్గా స్పెల్లింగ్ చెప్పి చరిత్ర సృష్టించిన చిన్నారి ఈ ఏడాది పోటీలో ఛాంపియన్గా నిలిచాడు. గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ ఇది.
Read Also: Post Office: రూ.5లక్షలు డిపాజిట్ చేయండి.. వడ్డీ రూ.2.25లక్షలు పొందండి
Also Read
- IMD Monsoon Forecast: రైతన్నలకు చేదు వార్త.. ఆగస్టు, సెప్టెంబర్లలో తగ్గనున్న వర్షాలు..
- Fuel Prices: తగ్గిన LPG ధరలు.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..
- Ruchika Singh: "నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి".. ప్రధానిని దూషించిన విద్యార్థిని వీడియో విడుదల
- Jio Annual Plan: జియో వార్షిక ప్లాన్తో అదిరిపోయే ఆఫర్.. అన్లిమిటెడ్ 5జీతో పాటు AI, OTT సబ్స్క్రిప్షన్లు ఉచితం
ఈ పోటీలో దేవ్ షా 22వ విజేత
ఈ పోటీలో దేవ్ షా 22వ విజేత. అతను 2019, 2021వ సంవత్సరాల్లో కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాడు. 2023 సంవత్సరంలో ఈ పోటీలో మొత్తం కోటి 10 లక్షల మంది పాల్గొన్నారు. అయితే 11 మంది పోటీదారులు మాత్రమే ఫైనల్స్కు చేరుకోగలిగారు. ఈ 11 మంది కంటెస్టెంట్స్లో దేవ్ షా ఒక్కడే అఖండ విజయం సాధించాడు. ఈ సందర్భంలో దేవ్ షా తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనవుతుండగా, దేవ్ షా మాత్రం తన కాళ్లు వణికిపోతున్నాయని అన్నారు.
Read Also: Sharwanand: హల్దీ ఫంక్షన్.. సందడంతా పెళ్లి కొడుకుదే
ఏళ్ల తరబడి భారతీయ అమెరికన్లదే ఆధిపత్యం
ఈ పోటీల ప్రాథమిక దశలు మంగళవారం జరుగగా, బుధవారం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్లు జరిగాయి. నేషనల్ స్పెల్లింగ్ బీని 1925లో ప్రారంభించారు. ఏళ్ల తరబడి భారతీయ అమెరికన్లదే ఆధిపత్యం. 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు.
గత ఏడాది కూడా భారతీయ అమెరికన్లదే విజయం
ఈ పోటీ 2020 సంవత్సరంలో రద్దు చేయబడింది. ఆ సమయంలో కరోనా ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. దీని తర్వాత, 2021 సంవత్సరంలో, ఈ పోటీని కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించారు. గతేడాది కూడా టెక్సాస్కు చెందిన భారతీయ అమెరికన్ హరిణి లోగన్ విజయం సాధించారు. అతను మరో భారతీయ అమెరికన్ విక్రమ్ రాజును ఓడించాడు.
తాజావార్తలు
-
Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. ‘ఆపరేషన్ సింధూర్’పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
-
August 2026 Smartphone Launches: గూగుల్ పిక్సెల్ 11 నుంచి పోకో ఎం8 పవర్ వరకు.. ఆగస్టులో రానున్న కొత్త ఫోన్లు
-
IMD Monsoon Forecast: రైతన్నలకు చేదు వార్త.. ఆగస్టు, సెప్టెంబర్లలో తగ్గనున్న వర్షాలు..
-
Jr NTR : ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!