America: దేవ్ కమాల్ కియా.. స్పెల్లింగ్ చెప్పాడు.. 42లక్షలు కొట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America: భారతీయ సంతతికి చెందిన 14 ఏళ్ల చిన్నారి అమెరికాలో అద్భుతం చేశాడు. ఇక్కడ జరిగిన పోటీలో 11 అక్షరాల పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పడం ద్వారా అతను 50 వేల డాలర్లు అంటే రూ.41.17 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. చిన్నారి పేరు దేవ్ షా. అతను తన తల్లిదండ్రులతో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నాడు. గురువారం రాత్రి, దేవ్ 2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో పాల్గొన్నాడు. ఈ సమయంలో అతనిని ‘ప్సామ్మోఫైల్’ (psammophile) అనే పదం స్పెల్లింగ్ అడిగారు. ఈ 11 అక్షరాల పదాన్ని సరిగ్గా స్పెల్లింగ్ చెప్పి చరిత్ర సృష్టించిన చిన్నారి ఈ ఏడాది పోటీలో ఛాంపియన్గా నిలిచాడు. గత 24 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ ఇది.
Read Also: Post Office: రూ.5లక్షలు డిపాజిట్ చేయండి.. వడ్డీ రూ.2.25లక్షలు పొందండి
Also Read
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
ఈ పోటీలో దేవ్ షా 22వ విజేత
ఈ పోటీలో దేవ్ షా 22వ విజేత. అతను 2019, 2021వ సంవత్సరాల్లో కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాడు. 2023 సంవత్సరంలో ఈ పోటీలో మొత్తం కోటి 10 లక్షల మంది పాల్గొన్నారు. అయితే 11 మంది పోటీదారులు మాత్రమే ఫైనల్స్కు చేరుకోగలిగారు. ఈ 11 మంది కంటెస్టెంట్స్లో దేవ్ షా ఒక్కడే అఖండ విజయం సాధించాడు. ఈ సందర్భంలో దేవ్ షా తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనవుతుండగా, దేవ్ షా మాత్రం తన కాళ్లు వణికిపోతున్నాయని అన్నారు.
Read Also: Sharwanand: హల్దీ ఫంక్షన్.. సందడంతా పెళ్లి కొడుకుదే
ఏళ్ల తరబడి భారతీయ అమెరికన్లదే ఆధిపత్యం
ఈ పోటీల ప్రాథమిక దశలు మంగళవారం జరుగగా, బుధవారం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్లు జరిగాయి. నేషనల్ స్పెల్లింగ్ బీని 1925లో ప్రారంభించారు. ఏళ్ల తరబడి భారతీయ అమెరికన్లదే ఆధిపత్యం. 8వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు.
గత ఏడాది కూడా భారతీయ అమెరికన్లదే విజయం
ఈ పోటీ 2020 సంవత్సరంలో రద్దు చేయబడింది. ఆ సమయంలో కరోనా ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించింది. దీని తర్వాత, 2021 సంవత్సరంలో, ఈ పోటీని కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించారు. గతేడాది కూడా టెక్సాస్కు చెందిన భారతీయ అమెరికన్ హరిణి లోగన్ విజయం సాధించారు. అతను మరో భారతీయ అమెరికన్ విక్రమ్ రాజును ఓడించాడు.
తాజావార్తలు
-
Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. నిందితుల రిమాండ్ పొడిగింపు!
-
Alaska Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లతో సహా 8 మంది మృతి
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
ట్రెండింగ్
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!