Delhi : లండన్ లోని భారత హైకమిషన్ ఆఫీస్ పై ఖలిస్థాన్ అనుకూలవాదుల దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్ లో ఖలిస్థాన్ అనుకూలవాదులు భారత హై కమిషన్ బిల్డింగ్ పై ఉన్న జాతీయ జెండాను కిందికి దించారు. అలా జెండాను అగౌర పరచడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు ఈ మేరకు భారత్ సమన్లు జారీ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు లండన్ లో చేసిన పనిని మన దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపింది. అక్కడి ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వారిస్ పంజాబ్ దే నాయకుడు ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ అనుచరులను రెండు రోజుల క్రితం పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పంజాబ్ లో రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Also Read : Salman Khan: సల్మాన్ ఖాన్కి మరోసారి బెదిరింపులు.. అదే లక్ష్యమంటూ ఈ-మెయిల్
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం లండన్ లో ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం నిరసనలు ప్రారంభించింది. లండన్ లో ఉన్న భారత హై కమిషన్ భవనంపై ఏర్పాటు చేసిన జెండాను కిందికి దించుతున్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసింది. దీనిమీద భారత విదేశాంగ శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఖలిస్థానీ నిరసనకారులు హై కమిషన్ వచ్చేంత వరకు.. అక్కడ ఇలాంటి చర్యకు పాల్పడతుంటే అక్కడి భద్రత సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
Also Read : Kakani Govardhan Reddy: ఇవే చంద్రబాబుకు ఆఖరి విజయోత్సవాలు.. 2024 ఎన్నికలే టీడీపీకి చివరివి..!
ఈ చర్య మీద వెంటనే కూలంకషంగా వివరణ ఇవ్వాలని భారత్ బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భారత హై కమిషన్ కు భద్రత కల్పించడం యూకే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని.. ఇది వియాన్నా ఒప్పందం ప్రకారం ఉన్న విషయమని భారత విదేశాంగ శాఖ గుర్తు చేసింది. లండన్ లోని భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం.. అక్కడున్న భారత సిబ్బంది భద్రత మీద యూకే ప్రభుత్వం ఇలా ఉదాసీనత చూపించడం.. ఏమాత్రం
ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంంది.
తాజావార్తలు
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!