Indian Coast Guard: 20 మంది బంగ్లాదేశ్ జాలర్లను కాపాడిన భారత కోస్ట్ గార్డ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Coast Guard: బంగాళాఖాతంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ మత్స్యకారులను భారత కోస్ట్ గార్డ్ రక్షించింది. సిత్రాంగ్ తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో జాలర్ల పడవ చిక్కుకుంది. తుఫాన్ కారణంగా జాలర్ల పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో జాలర్లు పడవ శిథిలాలను పట్టుకుని నీటిపై తేలియాడారు. వారిని గమనించిన కోస్ట్గార్డులు మొత్తం 20 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను రక్షించారు. భారత్, బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ల మధ్య ఉన్న అవగాహన ఒప్పందానికి అనుగుణంగా వారిని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్కు అప్పగించాలని యోచిస్తున్నారు.
సోమవారం రాత్రి నుంచి బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో 35 మందికి పైగా చనిపోయారు. శక్తివంతమైన సిత్రాంగ్ సైక్లోన్ బంగ్లాదేశ్ తీరాన్ని దాటడంతో ఆ దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. తుఫాను ప్రభావాలను నిశితంగా పరిష్కరిస్తున్న బంగ్లాదేశ్ అధికారులు వాతావరణ సూచన ప్రకారం తీర ప్రాంతాల ప్రజలను సకాలంలో తరలించడం వంటి అవసరమైన అన్ని సన్నాహాలను చేపట్టారు. బంగ్లాదేశ్లో సిత్రాంగ్ తుఫాన్ విళయతాండవం చేస్తోంది. 15 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు విద్యుత్తు లేకుండా చీకట్లోనే మగ్గుతున్నారు. దాదాపు 10,000 ఇళ్లు దెబ్బతిన్నాయని, 6,000 హెక్టార్ల (15,000 ఎకరాలు) పంటలు నాశనమయ్యాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. వేల సంఖ్యలో మత్స్యకార ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. బంగ్లాదేశ్ తుఫాన్ వల్ల విద్యాసంస్థలను మూసివేశారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Arvind Kejriwal: కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలు ముద్రించాలి..
సిత్రాంగ్ తుఫాన్ ప్రభావం భారత్లోని అస్సాంపై కూడా పడింది. తుఫాను కారణంగా సంభవించిన వరదల వల్ల 83 గ్రామాలకు చెందిన దాదాపు 1100 మంది ప్రజలు ప్రభావితమైనందున అస్సాంలో కూడా పరిస్థితి భయంకరంగా ఉంది. అస్సాంలో సిత్రాంగ్ తుఫాను కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం, తుఫాను కారణంగా 1146 మంది ప్రభావితమయ్యారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!