Indian Navy : ఇండియా జిందాబాద్… భారత నౌకాదళానికి పాకిస్తానీ మత్స్యకారుల సెల్యూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Navy : సోమాలియా సముద్రపు దొంగలపై భారత నౌకాదళం మరోసారి విరుచుకుపడింది. సముద్రపు దొంగల బారి నుంచి భారత నావికాదళం మరోసారి పాకిస్థాన్ మత్స్యకారుల ప్రాణాలను కాపాడింది. శుక్రవారం అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల బారి నుంచి ఇరాన్ ఫిషింగ్ ఓడ అల్ కాన్బర్, దాని 23 మంది పాకిస్థాన్ సిబ్బందిని భారత నావికాదళం రక్షించింది. సాయుధ దొంగలు ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్నారు.
సముద్రపు దొంగలపై నావికాదళం చేపట్టిన ఆపరేషన్లో భాగంగా ఓడలోని పాకిస్థాన్ పౌరులు భారత నావికాదళానికి కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థానీలు కూడా భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇంతకు ముందు కూడా, భారత నావికాదళం సముద్రపు దొంగల బారి నుండి పాకిస్తాన్, ఇరాన్ పౌరులను రక్షించింది. భారత నావికాదళం గతంలో 9 మంది సాయుధ సముద్రపు దొంగలను లొంగిపోయేలా చేసింది. దీని తరువాత, భారత నావికాదళానికి చెందిన నిపుణుల బృందాలు ఎఫ్వి అల్-కంబార్ను పరిశీలించాయి. ఫిషింగ్ కార్యకలాపాలను కొనసాగించడానికి పడవను తనిఖీ చేసిన తర్వాత, నేవీ 23 మంది పాకిస్తానీ పౌరులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించింది. పైరసీ నిరోధక చట్టం 2022 ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యల కోసం భారతీయ నావికాదళం మొత్తం తొమ్మిది మంది పైరేట్లను భారతదేశానికి తీసుకువస్తోంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Read Also:LSG vs PBKS: పంజాబ్ పై లక్నో సూపర్ విక్టరీ..
ఇరాన్కు చెందిన అల్ కంబర్ అనే నౌక అరేబియా సముద్రంలోకి వెళ్లింది. సిబ్బందిలో 23 మంది పాకిస్థానీ పౌరులు కూడా ఉన్నారు. ఇంతలో సముద్రపు దొంగలు ఓడపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై భారత నావికాదళానికి సమాచారం అందడంతో నౌకను విడిపించేందుకు నౌకాదళం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ సుమేధ ద్వారా సముద్రపు దొంగలపై దాడి చేసింది.
ఆపరేషన్ సమయంలో భారత నావికాదళం త్రిశూల్ క్షిపణిని ఉపయోగించింది. సుమారు 12 గంటల పాటు పోరాడి దొంగలను భారత నావికాదళం మట్టుబెట్టింది. మొత్తం 9 మంది సోమాలియా సముద్రపు దొంగలు భారత నావికాదళం ముందు లొంగిపోయారు. దీని తరువాత, భారత నావికాదళం మొత్తం 23 మంది పాకిస్తానీ పౌరులను దొంగల బారి నుండి విడిపించి, ఆరోగ్య పరీక్షను నిర్వహించింది.
Read Also:Pakistan: ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికైన జర్దారీ కుమార్తె అసీఫా
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!