Najam Sethi: “మేము కాదు.. వాళ్లే వెనక్కి తగ్గారు”.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రెచ్చగొట్టే ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former PCB chairman Najam Sethi: టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్పై ఓ క్లారిటీ వచ్చేసింది. తాము భారత్తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఇంతటితో వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ నజామ్ సేథీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్ వెనక్కి తగ్గలేదని.. ఐసీసీయే ఒక అడుగు వెనక్కి వేసిందని వాదిస్తున్నారు. “నిజానికి ఐసీసీయే కొంచెం సడలించింది. బంగ్లాదేశ్పై కొంత అనుకూలంగా ప్రవర్తించాలని నిర్ణయించింది. పాకిస్థాన్ చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఆడకపోతే ఎలాంటి శిక్షలు ఉండవని ముందే తెలుసుకున్నారు. దేశంలో, విదేశాల్లో ఉన్న ప్రముఖ న్యాయ నిపుణులతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చారు” అని సేథీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు పాకిస్థాన్కు బలం ఇచ్చాయని సేథీ చెప్పారు. మహా అంటే ఒక పాయింట్ కోల్పోయేవాళ్లం. అంతకంటే పెద్ద నష్టం ఏమీ ఉండేది కాదు. ఇది ఐసీసీకి కూడా అర్థమైంది. అందుకే ఐసీసీ స్వయంగా ముందుకు వచ్చి చర్చలు ప్రారంభించింది. డిప్యూటీ చీఫ్ ఇమ్రాన్ ఖవాజా రంగంలోకి దిగారు. బంగ్లాదేశ్ అధికారులు చర్చలకు వచ్చారు. ఆ తర్వాతే పాకిస్థాన్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించిందని వివరించారు.
READ MORE: UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ఇక ఆర్థిక విషయంపై సేథీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ నిధులపై ఆధారపడేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ఇప్పుడు పీఎస్ఎల్ భారీగా ఎదిగిందని.. పీఎస్ఎల్ నుంచి వచ్చే ఆదాయం ఐసీసీ కంటే ఎక్కువ అని చెప్పారు. కాబట్టి పాకిస్థాన్కు వనరుల కొరత అనే సమస్య లేదన్నారు. ఈ విషయంలో ఎప్పుడూ ఒత్తిడి అనేది లేదని అని స్పష్టం చేశారు. అయినా.. ఇక ముందు కూడా ఐసీసీ నుంచి కొన్ని సడలింపులు లేదా లాభాలు పాకిస్థాన్కు దక్కవచ్చు. మార్చి నాటికి మీరు కొన్ని కొత్త నిర్ణయాలు చూడవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మొత్తానికి, పాకిస్థాన్ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలపై ఇరు వర్గాల కథనాలు భిన్నంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇది చర్చల ఫలితమని ఐసీసీ వర్గాలు చెబుతుండగా, మరోవైపు పాకిస్థాన్ బలమైన స్థితిలో ఉండటమే మార్పుకు కారణమని సేథీ వాదిస్తున్నారు.
READ MORE: Pakistan vs USA: “ఇదెక్కడి దిక్కు మాలిన బౌలింగ్ రా మావా?”.. పాక్ బౌలర్పై ట్రోలింగ్స్..
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!