Ind vs Eng : టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

India Vs England

India Vs England

టీ20 వరల్డ్‌ కప్‌ తుది దశకు చేరుకుంది. ఫైనల్‌ పోరుకు అర్హత సాధించేందుకు జట్లు శ్రమిస్తున్నాయి. అయితే నేడు టీ20 వరల్డ్‌ కప్‌లో అడిలైడ్ వేదికగా భారత్‌తో ఇంగ్లాండ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఈ రోజు మధ్యాహ్నం 1.30 ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్‌ ఆటగాళ్లు మొదట బ్యాటింగ్‌కు దిగనున్నారు. అయితే.. ఇప్పటికే సెమీస్ మ్యాచ్ దాయాది పాకిస్తాన్.. న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా సైతం ఇంగ్లండ్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించి 2007 నాటి సెంటిమెంట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read : Modi No Entry Flex: ప్రధాని తెలంగాణ పర్యటన.. దర్శనమిచ్చిన ‘మోదీ నో ఎంట్రీ’ ఫ్లెక్సీ

తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

ఇంగ్లండ్: జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్