NTV Telugu Site icon

India vs England 2nd ODI: రెండో వన్డేకు టీమిండియా-ఇంగ్లాండ్‌ రె’ఢీ’.. అవి రెండూ జరగాలి..!

Ind

Ind

India vs England 2nd ODI: క‌టక్ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా రెడీ అయింది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే కటక్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలబడాలని ఇంగ్లండ్‌​ భావిస్తోంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్‌​ ట్రోఫీకి ముందు భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫామ్‌ అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో హిట్‌మ్యాన్‌ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్‌ పిచ్‌ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్‌.. ఇప్పుడు అదే బంతులకు తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. కనీసం రెండో వన్డేతోనైనా రోహిత్‌ తన ఫామ్‌లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఇటు మోకాలి నొప్పి వల్ల అనూహ్యంగా నాగ్‌పుర్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు కోహ్లీ. కానీ గాయం మరీ ఇబ్బందికరమైందేమీ కాదని స్పష్టం చేశాడు టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌. దీంతో ఈ మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కింగ్‌ కోహ్లి జట్టులోకి వస్తే.. ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఇక రెండో వన్డేలో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, శుభ్ మన్‌​గిల్‌​ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌ రైజ్ అండ్ ఫాల్..! అవినీతికి వ్యతిరేకం అని.. అదే ఊబిలో కూరుకుపోయి..!