India – Russia: కష్టకాలంలో కదిలొచ్చిన ‘మిత్రుడు’.. చమురు సంక్షోభంలో భారత్ను ఆదుకున్న రష్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – Russia: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా చమురు సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. ఈ సంక్షోభం వల్ల ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో భారత్ చమురు దిగుమతులు 13% తగ్గాయి. అయితే, ఈ గడ్డు కాలంలో రష్యా భారత్కు అండగా నిలిచింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్, మార్చి నెలలో ప్రతిరోజూ 45 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో మధ్యప్రాచ్యం నుంచి సరఫరా 61% పడిపోయి 11.8 లక్షల బ్యారెళ్లకు పరిమితమైంది. గత శనివారం నాడు హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు భారతీయ నౌకలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
READ ALSO: Ganja: గంజాయి మాయలో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఉద్యోగం వదిలి.. ఇంటిపైనే సాగు..
Also Read
- Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
- Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
ఆదుకున్న రష్యా
మధ్యప్రాచ్యం నుంచి చమురు రాక తగ్గడంతో, భారత రిఫైనరీలు రష్యా వైపు మొగ్గు చూపాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రష్యా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. ప్రతిరోజూ సగటున 22.5 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురు భారత్కు చేరుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను నియంత్రించడానికి అమెరికా రష్యన్ చమురుపై ఆంక్షలను సడలించింది. ట్రంప్ ప్రభుత్వం ఈ సడలింపును మరో నెల రోజుల పాటు పొడిగించడం భారత్కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ మినహాయింపు పొందిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇదే సమయంలో చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి (OPEC) వాటా భారత దిగుమతుల్లో రికార్డు స్థాయిలో 29 శాతానికి పడిపోయింది. గతంలో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్, యూఏఈల నుంచి భారత్కు సరఫరా కనిష్ట స్థాయికి పడిపోయింది. మార్చిలో భారత్కు అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో నిలవగా, సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. మధ్యప్రాచ్యం నుంచి చమురు తగ్గడంతో భారత్ ఆఫ్రికా దేశాల నుంచి (ముఖ్యంగా అంగోలా) దిగుమతులు పెంచింది. ప్రస్తుతం అంగోలా మూడవ అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది.
గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఒత్తిడి కారణంగా రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించిన భారత్, ఇప్పుడు యుద్ధం కారణంగా మారిన పరిస్థితుల్లో మళ్లీ రష్యానే నమ్ముకుంది. అమెరికా ఇచ్చిన వెసులుబాటుతో రాబోయే రోజుల్లో రష్యా నుంచి చమురు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
READ ALSO: SRH vs DC: ఉప్పల్లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: రికార్డుల మోత మోగిస్తున్న సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడు..
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
-
Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?