India – Russia: కష్టకాలంలో కదిలొచ్చిన ‘మిత్రుడు’.. చమురు సంక్షోభంలో భారత్ను ఆదుకున్న రష్యా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – Russia: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా చమురు సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. ఈ సంక్షోభం వల్ల ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో భారత్ చమురు దిగుమతులు 13% తగ్గాయి. అయితే, ఈ గడ్డు కాలంలో రష్యా భారత్కు అండగా నిలిచింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్, మార్చి నెలలో ప్రతిరోజూ 45 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో మధ్యప్రాచ్యం నుంచి సరఫరా 61% పడిపోయి 11.8 లక్షల బ్యారెళ్లకు పరిమితమైంది. గత శనివారం నాడు హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు భారతీయ నౌకలపై దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
READ ALSO: Ganja: గంజాయి మాయలో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఉద్యోగం వదిలి.. ఇంటిపైనే సాగు..
Also Read
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
- IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
- Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!
ఆదుకున్న రష్యా
మధ్యప్రాచ్యం నుంచి చమురు రాక తగ్గడంతో, భారత రిఫైనరీలు రష్యా వైపు మొగ్గు చూపాయి. ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో రష్యా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయి. ప్రతిరోజూ సగటున 22.5 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురు భారత్కు చేరుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలను నియంత్రించడానికి అమెరికా రష్యన్ చమురుపై ఆంక్షలను సడలించింది. ట్రంప్ ప్రభుత్వం ఈ సడలింపును మరో నెల రోజుల పాటు పొడిగించడం భారత్కు పెద్ద ఊరటనిచ్చింది. ఈ మినహాయింపు పొందిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇదే సమయంలో చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి (OPEC) వాటా భారత దిగుమతుల్లో రికార్డు స్థాయిలో 29 శాతానికి పడిపోయింది. గతంలో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్, యూఏఈల నుంచి భారత్కు సరఫరా కనిష్ట స్థాయికి పడిపోయింది. మార్చిలో భారత్కు అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశంగా రష్యా మొదటి స్థానంలో నిలవగా, సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. మధ్యప్రాచ్యం నుంచి చమురు తగ్గడంతో భారత్ ఆఫ్రికా దేశాల నుంచి (ముఖ్యంగా అంగోలా) దిగుమతులు పెంచింది. ప్రస్తుతం అంగోలా మూడవ అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది.
గత ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఒత్తిడి కారణంగా రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించిన భారత్, ఇప్పుడు యుద్ధం కారణంగా మారిన పరిస్థితుల్లో మళ్లీ రష్యానే నమ్ముకుంది. అమెరికా ఇచ్చిన వెసులుబాటుతో రాబోయే రోజుల్లో రష్యా నుంచి చమురు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
READ ALSO: SRH vs DC: ఉప్పల్లో ‘ఆరెంజ్’ ఆర్మీ వర్సెస్ ‘ఢిల్లీ’ వార్ షురూ.. టాస్ ఎవరు గెలిచారంటే!
తాజావార్తలు
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..
-
CSK vs LSG: నేడు చెపాక్లో అసలైన యుద్ధం.. ఈ మ్యాచ్లో అయిన ధోనీ ఉంటాడా?
-
IPL 2026: ఆర్సీబీకి తలనొప్పిగా మారిన ఇద్దరు స్టార్ ప్లేయర్లు.. కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం..!
-
Elvish Yadav: ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు!