ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 22,842 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,30,94,529 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,70,557 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 244 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,48,817 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 25, 930 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటి వరకు 90,51,75,348 కరోనా వ్యాక్సిన్ లు వేసినట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఇండియా కరోనా అప్డేట్ : కొత్తగా 22,842 కేసులు
