Site icon NTV Telugu

ఇండియాలో తగ్గిన కరోనా కేసులు… ఇవాళ ఎన్నంటే !

ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ…తగ్గుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,830 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 446 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు..

ఇదే సమయంలో 14,667 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది. దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,73,300 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,36,55,842 కి పెరిగాయి… ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,59,272 గా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు.. ఇప్పటి వరకు 1,06,14,40,335 మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.

Exit mobile version