Site icon NTV Telugu

షాకింగ్ సర్వే.. దేశంలో 31 లక్షలకు పైనే కరోనా మరణాలు?

దేశంపై మరోసారి కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని పలువురు నిపుణులు చెప్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం… దేశంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలకు, వాస్తవ లెక్కలకు వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. దేశంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనా మరణాలు ఐదు లక్షలు ఉంటే… వాస్తవానికి దీని కంటే 6-7 రెట్లు అధికంగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది.

https://ntvtelugu.com/central-government-alert-to-all-state-government-on-covid-situation/

2021 సెప్టెంబర్ నాటికి దేశంలో కరోనా మరణాలు 31-34 లక్షల వరకు ఉండొచ్చని అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక అంచనా వేసింది. గతంలో డెల్టా వేరియంట్ ప్రభావం వల్ల రోజువారీ కేసుల సంఖ్య అత్యధికంగా 4 లక్షలకు చేరింది. దీంతో కోట్లాది మంది ప్రజలు కరోనా కారణంగా ఆస్పత్రుల పాలయ్యారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరక్క విలవిలలాడిపోయారు. ఆ సమయంలో కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ టొరంటోకు చెందిన ప్రొఫెసర్ ప్రభాత్ ఝా నేతృత్వంలో జరిగిన అహ్మదాబాద్ ఐఐఎం ఈ సర్వేను నిర్వహించింది.

Exit mobile version