Site icon NTV Telugu

ఇండియాలో 11,850 కరోనా కేసులు, 555 మరణాలు

ఇండియా ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,850 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది.. మరో 555 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 12, 403 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు 3,386,483 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 274 రోజుల కనిష్టానికి చేరింది. ప్రస్తుతం దేశ్యాప్తంగా 1,36,308 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రికవరీ రేటు 98.26 శాతానికి పెరిగింది. ఇక, మృతుల సంఖ్య 4,63, 245 కి చేరింది.

Exit mobile version