ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,02,202 కి చేరింది. ఇందులో 3,35,83,318 మంది కోలుకొని డిశ్చార్జ్కాగా, 1,63,816 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 356 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 4,55,068 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 15,951 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇండియాలో కొత్తగా 12,428 కరోనా కేసులు
