Site icon NTV Telugu

ఇండియా కొత్తగా 10,126 కరోనా కేసులు, 332 మరణాలు

ఇండియాలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 10,126 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,37, 75 , 086 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,40,638 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 332 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4, 61, 389 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 11, 982 మంది క‌రోనా నుంచి కోలుకోగా 59, 08, 440 మంది టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,09, 08, 16, 356 మంది టీకాలు తీసుకున్నారు.

Exit mobile version