Site icon NTV Telugu

ఇండియాలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. తాజాగా దేశంలో కొత్తగా 36,083 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,21,92,576 కి చేరింది. ఇందులో 3,13,76,015 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,336 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 493 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,31,225 కి చేరింది. థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌నే వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలో త‌ప్పని స‌రిగా నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు రావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version