Site icon NTV Telugu

భారత్‌ లో కొత్తగా 41,649 కరోనా కేసులు, 593 మరణాలు

ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 41,649 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 593 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 37,291 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,13,993 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,07,81,263 కి పెరిగాయి… ఇక, కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,23,810 గా ఉండగా… ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 4,08,920 గా చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు.. ఇప్పటి వరకు 46,15,18,479 మందికి వ్యాక్సినేషన్‌ జరిగిందని బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.

Exit mobile version