India Budget Tradition: కేంద్ర బడ్జెట్కి ముందు ఆర్థిక మంత్రికి దహీ-చినీని ఎందుకు తినిపిస్తారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Budget Tradition:భారతదేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ను నేడు ( ఫిబ్రవరి 1న) పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్ అనేది కేవలం ప్రభుత్వ ఖర్చుల ప్రకటన మాత్రమే కాదు.. కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ దేశ ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నారు. కాగా, 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.11. 24 లక్షల కోట్లతో కూడిన బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 7.9 శాతం వృద్ధిగా అంచనా వేస్తున్నారు.
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
బడ్జెట్కు ముందు దహి-చీనీ వేడుక:
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, శుభ సంకేతాలతో ముడిపడి ఉంటాయి. ప్రతి ఏడాది ప్రవేశ పెట్టే కేంద్ర బడ్జెట్ కి ముందు పెరుగు-చక్కెర (దహీ- చినీ) వేడుక ప్రత్యేక సంప్రదాయంగా వస్తుంది. బడ్జెట్ ప్రవేశానికి ముందుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్ను సందర్శించి రాష్ట్రపతిని కలుసుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆర్థిక మంత్రికి పెరుగు-చక్కెర (దహీ- చినీ)ని తినిపించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, భారతీయ సంప్రదాయంలో పెరుగు, చక్కెర శుభప్రదం, విజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ ఆచారం బడ్జెట్ విజయవంతంగా పూర్తవాలని, దేశ ఆర్థిక ప్రయాణం సజావుగా కొనసాగాలని ఆశిస్తూ నిర్వహించబడుతుంది.
Read Also: Jowar Biscuit Recipe: ఇంట్లోనే క్రంచీ క్రంచీ జొన్న పిండి రుచికరమైన బిస్కెట్స్ ఇలా చేసేయండి!
బడ్జెట్ ప్రవేశాల రికార్డు:
నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్ మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సంఖ్యలో బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జీ దేసాయ్ రికార్డు కొనసాగుతోంది. ఆయన మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. 1959 నుంచి 1964 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిగా ఆరు బడ్జెట్లు, 1967 నుంచి 1969 మధ్య నాలుగు బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. ఇక, రెండో స్థానంలో మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఉన్నారు. ఆయన మొత్తం 9 బడ్జెట్లు ప్రవేశ పెట్టగా.. నేటి బడ్జెట్తో నిర్మలా సీతారామన్ పి.చిదంబరం రికార్డును సమానం చేయనున్నారు. మొరార్జీ దేసాయ్ చారిత్రక రికార్డుకు మరో అడుగు దూరంలోనే ఆమె ఉన్నారు. కాగా, దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, మధ్య తరగతి ఆశలు, పెట్టుబడులు, సంక్షేమ పథకాలపై ఈ బడ్జెట్ కీలక ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!